Posts

Showing posts from August, 2021

🔻**సాలిగ్రామం, గండకీ కథ**🔻

Image
#సాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ♦ఇది ఊరి పేరు కాదు. గ్రామం అస్సలే కాదు. విష్ణువు ఆకారంలో ఉండే చిన్నచిన్న రాళ్లనే సాలి గ్రామం అంటూ ఉంటారు. వాటిపై విష్ణువు రూపం ఉటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి. గండకి నది గర్భంలోనే ఇలాంటి రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది పూజగదిలో ఉంచుకుని పూజిస్తుంటారు. వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం. ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి. తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి. లోపల విష్ణువు కనపడతాడు. ఇంత ప్రత్యేకమైన సాలి గ్రామాలు గండకి నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది. ♦*పూర్వం గండకీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకీ ఉండేది. గండకీ ఒక వేశ్య. ♦గండకీతో ఒక్కరాత్రి గడిపితే చాలు వాళ్ల తలరాతలు మారిపోయేవి. వాళ్ల అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా, గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకీ మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. ♦చెడ్డ వాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక్క వ్యక్తితోనే గడిపేది. భర్తగా

🍂 ❤ 🌹 -కృష్ణం వందే జగద్గురుమ్,- 🌹 ❤ 🍂

Image
♦శ్రీకృష్ణుడి జీవితాన్ని అనుశీలిస్తుంటే మనం ఎంతో ఆశ్చర్యానికి లోనవుతాం. కళ్లు తెరిచింది కటకటాల్లో... ఊపిరి పీల్చింది అపాయాల్లో... బతుకు గడిచింది గండాల్లో... చివరకు చరమ దశా పరమ చేదే! కాలి బొటన వేలికి వేటగాడి బాణం నాటుకొని ప్రాణాలు తోడేస్తుంటే... బొట్టు బొట్టుగా నెత్తురు స్రవించి కడకు దేహం నిర్జీవంగా నేలకూలిపోవడమంటే- బతుక్కి ఎంత విషాదభరితమైన ముగింపు! ఏమనాలి ఆ జాతకాన్ని? ♦చిత్రం ఏమంటే- అదే జాతకుడి చిరు కర స్పర్శ మృతశిశువు పరీక్షిత్తుకు ప్రాణం పోసింది. కురూపి కుబ్జను అద్భుత సౌందర్యరాశిని చేసింది. కన్ను తెరవలేని స్థితిలో అంపశయ్యపై మేను వాల్చిన భీష్మ పితామహుడి చేత గొప్పగా ధర్మబోధ చేయించి లోకం కళ్లు తెరిపించింది. ♦ఆశ్చర్యం ఏమంటే- ఆయనను నమ్ముకున్న వారంతా రకరకాల చిక్కుల్లోంచి, అపాయాల్లోంచి, పెను గండాల్లోంచి ఆయన అండతోనే క్షేమంగా బయటపడ్డారు. ‘నీలో లేని చోద్యాలు ఈ లోకంలోనే ఉండవు సుమా! అసలు చోద్యం అంటే నువ్వే...’ అని ఆశ్చర్యపోయాడు భాగవతంలో అక్రూరుడు. కోరికతో, భయంతో, భక్తితో, బంధంతో, ప్రేమతో, కోపంతో, స్నేహంతో... ఏదో రకంగా తనను పొందమని ప్రోత్సహించాడాయన. అలా పొందినవారందరినీ అందలాలెక్కించాడు. ముక్తిని

🚩🚩 ఆంగ్లము నుండి మక్కీకి, మక్కీ ఆంద్రీకరణ,!! ♦ఉమాపతి సెల్ మోగుతోంది.

Image
 🚩🚩 ఆంగ్లము నుండి మక్కీకి, మక్కీ ఆంద్రీకరణ,!! ♦ఉమాపతి సెల్ మోగుతోంది. అతను అది ఎక్కడ వుందో కనపడక వెతుకుతూ నా చరవాణి ఎక్కడ?చరవాణీ ఎక్కడున్నావే అని గట్టిగఅరుస్తూ వుంటే,కిచన్ లో కిచిడీ చేస్తున్న భార్య కనకం కోపంగా చరవాణా అదెవత్తీ? అంటూనడ్డి మీద చేతులు పెట్టుకొని చేతిలో  గరిటతో సహా వచ్చింది. ♦అదేనే కనకం నా సెల్ ఫోను. . అలా అఘోరించ వచ్చుగా అని మీ చొక్కా జేబులో వుంది. అని చెప్పి వెళ్లి పోయింది. ♦వెంటనే తెచ్చు కొని ఆకుపచ్చ మీట నొక్కి ఎవరూ అన్నాడు? నేను బావా రమాపతిని.మా అబ్బాయి గణపతి కి కి ఈ నెల పదో తేదీన ఉపనయనం చేస్తున్నాము. మీరూ,చెల్లి తప్పక రావాలి. ఏ ట్రైన్ కి వస్తారో చెప్తే స్టేషన్ కి కారు పంపిస్తాను. సరే వస్తాం లే బావా అని సెల్ పెట్టేసి భార్యను  ♦కనకం యిటు రావోయ్ అని పిలిచాడు. మీ అన్న కొడుకు ఉపనయనం అట.తప్పక రమ్మన్నాడు. .అంచేత దరిద్ర రథం లో రెండు శయనాలు పుస్తకం చెయ్యమని సంతోషకర ప్రయాణాల  వాడికి నీ చరవాణి లో చేప్పేయ్.అన్నాడు. ♦కనకం నెత్తి కొట్టుకుంటూ మీ భార్య నైన పాపానికి దరిద్ర రథం అంటే గరీబ్ రథ్ అనీ శయనాలు అంటే బెర్త్స్ అనీ అర్థ మయింది .ఆ పుస్తకం చెయ్యడమేమి టో,ఆ సంతోష ప్రయాణాల వాడెవడో మీ

❤ మరుపురాని పాత్ర కాంతం!❤

Image
, ♦ఆమె నవ్విస్తుంది. కవ్విస్తుంది. చక్కిలిగింతలు పెడుతుంది.ఆలోచింపచేస్తుంది. ఒక్కోసారి కంటతడి పెట్టిస్తుంది కూడా.  అది ఆమెకు మాత్రమే సొంతమైన జీవనసరళి. కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. భర్త అంటే బోలెడు ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి. ఆంధ్ర దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా మనకు కాంతం కన్పిస్తుంది. ♦కాంతం అంత పొడగరీకాదు, పొట్టికాదు. ఛామన ఛాయ, నవ్వు మొగము, చక్కని నేత్రాలు బాపు బొమ్మకాదు కానీ అందగత్తే. కాంతానికి ఇంగ్లీషు రాదు. కానీ భర్త మాట్లాడుతుంటే నాకేదో అర్ధమయినట్లే ఉందని అనుకునే అమాయక స్త్రీమూర్తి. వారప్రతికలను చదవాలనే ఆసక్తి లేకపోయినా, కుమారీ శతకం, నృసింహ శతకం, ప్రహ్లాద చరిత్ర మున్నగు పుస్తకాలు మాత్రం చదవి అర్ధం చేసుకోగలదు. ♦సగటు తెలుగు మహిళ కాంతం అని చెప్పవచ్చు. ఆమెకు మల్లెపూలు, తెల్ల చీర అంటే మహా ఇష్టం. మంచి పొదుపరి. ఎంత కోపంలో ఉన్నా నవ్వించగల మంచి మాటకారి. మాటకుమాట ఎదుటవారు నొచ్చకోకుండా బదులు చెప్పగల నేర్పరి.  ♦ఒకరోజు భర్త, మీ చెల్లెలు ఒక కోతి మీ అక్కయ్య మరొకకోతి, తోకలు మాత్రం లేవు అని ఆటపట్టిస్తే, ఆమె తడుముకోకుండా మీ చెల్లెళ్లకు ఆ కొరతలేదని బ

రామాయణ మహాకావ్యము .❤️ (బాపు బొమ్మలతో .) 🚩 అయోధ్యా కాండము (2) ❤️

Image
రామాయణ మహాకావ్యము .❤️  (బాపు  బొమ్మలతో .)                             🚩 అయోధ్యా కాండము  (2) ❤️ ❤️కాని రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి కృతనిశ్చయుడై ఉన్నాడు. రామునితోబాటు ఆత్మయైన సీత, నీడయైన లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరారు.  అయోధ్యపురవాసులంతా విలపించారు.అందరివద్దా సెలవు తీసుకొని సీతారామలక్ష్మణులు సకలసౌఖ్యాలూ వర్జించి, నారదుస్తులు ధరించి వనవాస దీక్షకు సిద్ధమైనారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు.  ♦అక్కడ దశరధుడు రామునికై విలపిస్తూ స్వర్గతుడైనాడు. ♦మేనమామల ఇంటినుండి అయోధ్యకు వచ్చిన భరతుడు తల్లి చేసిన పనికి మండిపడ్డాడు. ఆమె ముఖం చూడడానికీ, తన ముఖం ఇతరులకు చూపడానికీ అతని మనసొప్పలేదు.  ♦సైన్యంతో అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో" అని ప్రార్థించాడు.  ♦తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే" అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా

🔻 యాదవ ముసలం-కృష్ణ నిర్యాణం ! 🔻

Image
 🔻  యాదవ ముసలం-కృష్ణ నిర్యాణం !  🔻 ♦మహా భారతం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీ కృష్ణుడు .  కృష్ణ లీలలు . కౌరవ పాండవ వైరం . కురుక్షేత్ర యుద్ధం . కాని తక్కువ తెలిసిన కధల్లో శ్రీ కృష్ణ నిర్యాణం . కురుక్షేత్ర యుద్ధం తరువాత శోకం లో ఉన్న గాంధారి కౌరవ కుల వినాశనానికి కృష్ణుడే కారణమని భావించి యుద్ధం ముగిసిన రోజునుండి 36ఏళ్ళ తరువాత నీ యాదవ కులం అంతా నా వంశం నశించినట్టు నశిస్తుందని శాపించింది . ♦ఏళ్ళు గడచి పోతున్నై ,ఒక రోజు విశ్వామిత్రుడు ,నారదుడు ,మొదలగు మహా ఋషులు తమ శిష్యులతో కృష్ణుని చూడటాని వచ్చారు . వారిని చూసిన యాదవులు అమిత గర్వం తో ,ఋషులను ఆట పట్టించాలని వారిలో ఒకడైన కృష్ణ కుమారుడైన సాంబుడికి ఆడవేషం వేసి వారి వద్దకు వెళ్లి  "ఈమెకు సంతానం కలుగుతుందా ?"అని అడిగారు . ♦వారి ఆకతాయి పనికి కోపం వచ్చిన ఋషులు "కృష్ణుని కుమారుడైన ఈ సాంబుడు యాదవ వంశ నాశనానికి కారణమైన రోకలిని కంటాడు . మా మాట జరిగి తీరుతుంది పొండి . బలరామకృష్ణులు తప్ప అందరు రోకలి కున్న దైవశక్తి తో చనిపోతారు ." అని కృష్ణుని చూడకుండానే వెనక్కి వెళ్లి పోయారు . ♦ఈ సంగతి తెలిసిన యాదవ పెద్దలు కృష్ణుని వద్ద బాధ పడ్డారు

🚩🚩🚩❤నటదిగ్గజం- "బళ్ళారి రాఘవ".❤🚩🚩🚩

Image
♦బళ్ళారి రాఘవ (ఆగష్టు 2, 1880 - ఏప్రిల్ 16, 1946) తెలుగు నాటకరంగ ప్రముఖులు.  ప్రముఖ న్యాయవాది అయినా నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభతో రాణించాడు.  తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం వెచ్చించిన 1946, ఏప్రిల్ 16 న మరణించాడు. ♦అతని పూర్తిపేరు తాడిపత్రి రాఘవాచార్యులు. తండ్రి నరసింహాచారి, తల్లి శేషమ్మ. రాఘవ తల్లిదండ్రులకు లేకలేక పుట్టిన బిడ్డ.  వారిది శ్రీవైష్ణవ శాఖకు చెందిన బ్రాహ్మణ కుటుంబం. తండ్రి తాడిపత్రి పురపాలక సంఘ పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసేవాడు ♦రాఘవకు బాల్యం నుంచే నటనలో, నాటకాల్లో ఆసక్తి ఉండేది.  అది మరింత వికసించి మద్రాసులో చదివే రోజుల్లో అనేక నాటకాల్లో నటించి అనుభవం గడించేలా ఉపకరించింది. ♦బళ్ళారి ఉన్నత పాఠశాల చేరి మెట్రక్ పూర్తి చేసి, మద్రాసులోని క్రిష్టియన్ కాలేజీలో న్యాయశాస్త్రం చదవడానికి చేరాడు. న్యాయశాస్త్రంలో 1905లో ఉత్తీర్ణత పొందాక, మద్రాసులో న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు. కొద్దికాలంలోనే రాఘవ న్యాయవాదిగా, ముఖ్యంగా క్రిమినల్ కేసులు వాదించడంలో, ప్రసిద్ధి చెందాడు. ధనికుడయ్యాడు. ఆయన ప్రతిభను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పబ్లిక్ ప్రాస

🚩"ఎ ఆవ్ రా బా వా "🤣

Image
💥 👉ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థాన కవులందరికీ ఒక పరీక్ష పెట్టాడు. " మీరు ఐదు అక్షరాల పదం ఒకటి రూపొందించాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో పుండాలి. ఆ ఒక్కొక్క అక్షరానికి ఆ భాషలో ఏమి అర్థమో మిగిలిన నాలుగు భాషల్లో కూడా అదే అర్థం వుండాలి. అంతేకాక ఆ ఐదక్షరాల పదంకూడా అర్థవంతంగా వుండాలి. దీనికి సమాధానం రేపు సభాముఖంగా నాకు చెప్పండి." కవులలో కలకలం బయలుదేరింది. విచిత్రమైన సమస్య అనుకుని ఎవరింటికి వారు బయల్దేరి వెళ్లారు. మన తెనాలి రామకృష్ణ కు నిద్రపట్టడం లేదు. తన బావమరిది ఇంటికెళ్ళి అక్కడ పశువుల పాకలో మంచంవేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు‌. అర్థరాత్రి అయినది. ఆ సమయానికి పశువులశాలలో ఒక ఆవు దూడను ప్రసవించినది. వెంటనే రామ కృష్ణుడు " బావా! బావా! ఆవు ఈనింది‌" అని కేకలు వేశాడు. నిద్రమత్తులో నున్న బావమరిది ఆ మాటలు విని " ఏ ఆవ్ రా బా వా " అని అడిగాడు. రామకృష్ణకు వెంటనే ఏదో స్ఫురించింది. ఎగిరి గంతేసాడు. మరునాడు మహారాజు సభ తీర్చాడు. " అందరూ సిద్ధంగావున్నారా" రాయలవారి మాట విన్న కవులు ఏమీ మాట్లాడలేదు. కాని రామకృష్ణుడు మాత్రం లేచి " నేను సిద్ధమే" అన్నాడ

🚩తద్దినం ! (ఒక చిన్న కధ .)

Image
🔻 ఆ రోజు సోమయాజులు ఇంట్లో తద్దినం. డాబా మీద కొంతమంది పైకి చూస్తూ... కొంతమంది చుట్టుపక్కల చూస్తూ... కా... కా... అంటూ అరుస్తున్నారు. ఎందుకంటే కాకుల కోసం. పంతులు, సోమయాజి ఇంట్లోంచి ఓ అరటి ఆకులో పిండాలు తెచ్చి పిట్ట గోడ మీద పెట్టి తను కూడా అరవటం మొదలు పెట్టారు. కాని కాకులు రావటం మాట అటుంచి... అసలు కను చూపు మేరలో కాకి అన్నదే కనిపించలేదు. చివరకి ఆడాళ్ళూ... మగాళ్ళూ ... కూడా కలిసి అరవటం మొదలు పెట్టారు. పిల్లలకి ఏమీ అర్ధం కాక వాళ్ళూ కూడా గొంతు కలిపారు. కానీ వాళ్ళు గొంతులు కలిపింది కాకులకోసం కాదు... ఆకలేసి. ‘బామ్మా... కాకులు రావడం లేదే... ఆకలేస్తోంది... అన్నాడు సోమయాజి కొడుకు రామ సోమయాజులు. ‘కాకి ముట్టుకోకుండా ఎవరూ మెతుకు ముట్టడానికి వీల్లేదు.’ అంది ఖరాఖండిగా బామ్మ. అందరూ ముఖాలు చిన్నబుచ్చుకున్నారు. రెండు గంటలు దాటింది. పంతులు గారు కూడా ఆకలితో నక నకలాడుతున్నారు. ‘పంతులుగారు కాకులు కాదుకదా... కాకి ఈక కూడా కనబడటంలేదు... ఏం చేద్దాం?' అడిగాడు సోమయాజి. ‘మీరేం కంగారు పడకండి. ఓ పావు గంటలో కాకి వస్తుంది.’ అన్నాడు పంతులు. అందరూ ఆశ్చర్యంగా చూసారు. రెండు గంటలైనా రాని కాకులు. ఓ పావు గంటలో ఎలా వస్తాయండి

🚩విలక్షణ గాయనీమణి...అద్భుత నటీమణి 🚩 🔻పద్మభూషణ్ భానుమతి!🔻

Image
🚩భానుమతిగారి గొంతులో అదో రకం అందం వుంటుంది. ఆమె పాట వింటూ వుంటే మనసు స్వర్గ సీమలో పావురంలా ఎటో వెళ్ళిపోతుంది. ఎంత మంది సింగర్స్ వచ్చినా ఆమెలా పాడేవారు ఇంత వరకు ఎవరూ లేరంటే అది అతిశయోక్తి కాదు. 🚩తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ వెండితెర అద్భుతంలా అనిపించే చిత్రం...'మల్లీశ్వరి'. ఆ చిత్రరాజంలో ప్రతీ పాటా మనసును దోచేస్తుంది. ముఖ్యంగా దేవులపల్లివారి కలం నుంచి జాలువారిన మనసున మల్లెల పాట కలకాలం గుర్తుండి పోతుంది. భానుమతి గారి గాత్రంలో తొణికిసలాడిన మాధుర్యం...అభినయంలో ఆమె ప్రదర్శించిన అద్వితీయ ప్రతిభ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. . 🚩అజరామరం 'లైలా మజ్ను'ల ప్రేమకథ. మనసు చేసే పెను మాయ పేరే ప్రేమ. ఒక్కసారి ప్రేమలో పడితే మనసు మరో ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ప్రేమకు సంబంధించి బోలెడు కథలున్నాయి. వాటిల్లో గుండెకు గాలం వేసే కథలు కొన్నే వున్నాయి. అలాంటి కథల్లో అజరామరంగా నిలిచిపోయిన ప్రేమకథ...'లైలా మజ్ను'ల ప్రేమకథ. ఈ కథను సినిమాగా కూడా తీశారు.అక్కినేని 'మజ్ను'గా, భానుమతి 'లైలా'గా అపూర్వ నట విన్యాసం ప్రదర్శించిన ఆ చిత్రంలో...పల్లవించే పాటలు ఎన్నో వున్నాయి. వాట

🔴🚩🚩-అతిరథ మహారథులు..అంటే..ఎవరు..!!💐శ్రీ💐

Image
♦#అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం. యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. ఇందులో 5 స్థాయులున్నాయి. అవి.. ❤ రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి. ❤ 1) రథి..💐 ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు. సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర, కౌరవుల్లో 96మంది, శిఖండి, ఉత్తమౌజులు, ద్రౌపది కొడుకులు - వీరంతా..రథులు. ❤ 2) అతి రథి (రథికి 12రెట్లు)..💐 60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు. లవకుశులు, కృతవర్మ, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు, విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోత్కచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యుధిష్ఠిర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు వీరంతా..అతిరథులు. ❤ 3) మహారథి (అతిరథికి 12రెట్లు).💐 7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు. రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థా

❤️🙂చక్రపాణి (సినిమా)🙂❤️

Image
 ❤️🙂చక్రపాణి (సినిమా)🙂❤️ 🚩అర్ధాంతరంగా తననుమిస్సమ్మ నుండి తప్పించినందుకు  ప్రతిగా సొంత బ్యానరు మీద ‘చక్రపాణి’ అనే సినిమాను పేరడిగా  తీసి, చక్కన్నను (చక్రపాణి గారు.)ఒక లోభిగా చూపిస్తూ (ఆ పాత్రలో సి.ఎస్‌.ఆర్‌ నటించారు)  🚩 మిస్సమ్మ సినిమా కన్నా ముందే (19-03-1954) దాన్ని విడుదల చేసి కసి తీర్చుకుంది.  🚩అంతేకాదు ‘రంభా చక్రపాణీయం’ (అంటే సావిత్రి చక్రపాణి )పేరుతో ఒక వ్యంగ్య రచనను కూడా పాఠకుల మీదకు వదిలింది. 🚩 🚩చక్రపాణి మంచి హాస్యభరితమైన తెలుగు సినిమా. దీనిని భరణీ పిక్చర్స్ పతాకంపై భానుమతీ రామకృష్ణారావులు నిర్మాతలుగా నిర్మించారు. ప్రధాన పాత్రల్ని అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి పోషించారు. 🚩చిత్రకథ చక్రపాణి (సి.ఎస్.ఆర్.) కి ఒక మనవడు, ముగ్గురు మనవరాళ్ళు. మనవడు ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. పెళ్ళైన ఇద్దరు మనవరాళ్ళలో ఎవరు ముందుగా మనవణ్ణి ఇస్తే వారికి లక్ష రూపాయలు ఇస్తానని చక్రపాణి ప్రకటిస్తాడు. అతని మొదటి మనవరాలికి ఆడపిల్ల. రెండవ మనవరాలు మాలతి (భానుమతి), ఆమె భర్త చలం (అక్కినేని). మాలతి ఎలాగైనా లక్ష రూపాయలు సంపాదించాలని స్నేహితురాలు మనోరమ (సూర్యకాంతం) సలహాపై ఎదురింట్లో ఉన్న బాబును తీసుకొచ

🔴 🚩🙏 దశావతారము ల లో బుద్ధ అవతారం.🙏 🚩 🔴

Image
♦#పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు.  ♦అలాంటి అవతారాలలో 21దశావతారాలలో బుద్ధావతారానికి  ఎంతో విశిష్టత వుంది. రాక్షస జాతిలోని హింసా ప్రవృత్తిని నిర్మూలించి ...  అది వారి బలహీనతగా మారిన సమయంలో పరమాత్ముడు వారిని సంహరించాడు. తారకాసురుడు కుమారులైన విద్యున్మాలి ... తారకాక్షుడు ... కమలాక్షుడు వరబల గర్వంతో అటు దేవతలను ఇటు సాధుజనులను నానాకష్టాలు పెట్టసాగారు. దాంతో  ♦బ్రహ్మదేవుడు ... శ్రీ మహా విష్ణువు ఆవు - దూడగా రాక్షస రాజ్యంలోకి అడుగుపెట్టారు. అక్కడి తటాకంలోకి దిగి అవి దాహం తీర్చుకుంటుండగా తారకాసురుడి కుమారులు చూశారు. దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆవుదూడలను బంధించడానికి ఆ తటాకంలోకి దిగారు. దాంతో ఒక్కసారిగా ఆ తటాకంలోని నీరంతా తాగేసి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యాడు. దూడగా వున్న విష్ణువు బుద్ధుడిగా వారి ఎదుట ప్రత్యక్ష్య మయ్యాడు. ♦జరిగిన మాయ గురించి వాళ్లు ప్రశ్నించగా అందుకు సమాధానం చెబుతూనే, అహింసా మార్గంలోని గొప్పదనాన్ని గురించి వారికి ఉపదేశించాడు. బుద్ధుని బోధనలు ఆకట్టుకోవడంతో వారు తమ దూకుడును తగ్గించుకు

🌹💥 జయ -విజయులు!💥🌹 (చిత్రం ... బేలూర్ ఆలయ ముఖ ద్వారం .)

Image
  🚩🚩 జయ విజయులు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వార పాలకులు. వీరి గురించి భాగవత పురాణం లో ఉంది. ఒక సారి బ్రహ్మ యొక్క మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్ధమై వైకుంఠానికి వేంచేస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు శ్రీహరి వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగిస్తారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక సనందనాదులు ఆగ్రహించి భూలోకం లో మర్త్యులై సంచరించెదరని శాపం ఇస్తారు. దాంతో వారిరువురూ వెళ్ళి శ్రీ మహా విష్ణువు సంగతి నివేదిస్తారు. సర్వాంతర్యామినైన నాకు అందరితో గడపడానికి సమయం ఉంటుంది అంటూ వారి నిర్ణయాన్ని తప్పు పడతాడు. తరువాత తానే స్వయంగా వెళ్ళి తీసుకు వస్తాడు. ఆ మహర్షులు అందుకు అమితానందం పొందుతారు. వారికి పడ్డ శిక్ష గురించి ఏమి నిర్ణయించాలో ఆయనకే వదిలి వేస్తారు. తనకు ఆ శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదనీ కాకపోతే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు. అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు