Posts

Showing posts from September, 2022

శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం.

Image
       “భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగ దూడలై యేడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు. పితుకుచున్నారు మూతులు బిగియగట్టి”. భా రతీయులను అనేక బాధలకు, అవమానాలకు గురిచేస్తున్న ఆంగ్లేయుల దౌర్జన్యాలనూ, కుటిల రాజనీతిజ్ఞతనూ, దోపిడీ విధానాలను తీవ్రంగా దుయ్యబడుతూ బిపిన్ చంద్రపాల్ రాజమహేంద్రవరంలో 5 రోజులపాటు ఇచ్చిన ఉపన్యాస సారాంశానికి చిలకమర్తి ఇచ్చిన పద్యరూపమే ఇది. భారతీయతను పుణికిపుచ్చుకుంటూ ఆంగ్ల పాలకులపై నిప్పులు చెరిగిన కలం ఆయనది.”భరతఖండంబె యొక గొప్ప బందిఖాన” అంటూ నాటి దేశ పరిస్థితులను కళ్ళకు కట్టినవాడు శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుగొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకరు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం. లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26న పశ్చిమ గోదావరి జిల్ల

🚩🚩 పానుగంటి లక్ష్మీనరసింహం,

Image
        పానుగంటి లక్ష్మీనరసింహం, #పానుగంటి   లక్ష్మీనరసింహం గారు వ్యంగ్య రచనలో అందే వేసిన చెయ్యి. తెలుగు సాహిత్యంలో పానుగంటి రాసిన సాక్షి వ్యాసాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన తూర్పుగోదావరి జిల్లా, సీతానగరంలో 1865 నవంబర్ 2న జన్మించారు. పిఠాపురంరాజా సూర్యారావు కోరిక మేరకు పానుగంటి అనేక నాటకాలు రాశారు. ఆయనను ‘ఆంధ్రా షేక్‌స్పియర్’, ‘ఆంధ్రా ఎడిసన్’ అని పిలిచేవారు. ఆయనకు ‘అభినవ కాళిదాసు’ అనే బిరుదు ఉంది. ‘విప్రనారాయణ చరిత్ర’, ‘పాదుకా పట్టాభిషేకం’, ‘రాధాకృష’్ణ, ‘కాంతాభిరామం’, ‘రాతిస్తంభం’, ‘కళ్యాణ రాఘవం’ లాంటి ఎన్నో రచనలను తెలుగు పాఠకులకు అందించారు. ఆయన రాసిన చాటువులు చూడండి ... వేపారి కంటె సరసుడు నేపాళపు మాత్రకంటే మేలౌ మందున్ వేపాకు కంటె చేదును సాపాటున కంటే సుఖము నహి నహి మహిలోన్ ! బచ్చుండవు నెర దాతల మ్రుచ్చుండవు శత్రువులకు మహిత జ్వాలా చిచ్చుండవు కవి వర్యుల మెచ్చుండవు మేటి సుగుణ పుట్టీ ! సెట్టీ ! ఆ రోజుల్లో అవి కలిగించిన సంచలనం అంతా యింతా కాదు. #"జంఘాలశాస్త్రి" అనే పాత్ర ముఖతః పానుగంటివారు సమకాలిక సాంఘిక దురాచారాలమీద, మూఢ విశ్వాసాలమీద పదునైన విమర్శలు చేసేవారుసాక్షి వ్యాసాల నుండీ క

🚩🚩-ఒకే ఒక్కడు -కవి సమ్రాట్‌విశ్వనాథ! ( - శ్రీరమణ గారు )

Image
🚩🚩-ఒకే ఒక్కడు -కవి సమ్రాట్‌విశ్వనాథ! ( - శ్రీరమణ గారు ) ♦️ఆయన ఒక విశ్వవిద్యాలయం. మన సాంప్రదాయాలు కట్టుబాట్లు చెదరరాదని గస్తీ తిరిగిన యుద్ధనౌక! గాఢ ప్రతిభాశాలి. ధిషణాహంకారి. ఆంధ్ర సాహిత్య క్షేత్రంలో #విశ్వనాథ_సత్యనారాయణ చేయని సేద్యం లేదు, పండించని పంట లేదు. తెలుగుజాతి పట్ల విశ్వనాథకు అలవిమాలిన ఆపేక్ష. ఉత్తరాదిన పుట్టి పెరిగిన రాముడు, విశ్వనాథ ప్రాపకంలో తెలుగురాముడు అయినాడు. నా రాముడని తనివితీరా కలవరించి పలవరించారు. విశ్వనాథకున్న అనుచర వర్గం, శిష్య వర్గం మరొకరికి లేదు. ఇష్టులు, అయిష్టులు కలిసి విశ్వనాథను నాడు నేడు కూడా సజీవంగా ఉంచుతూ వస్తున్నారు.  సెప్టెంబర్10 ఆయన జయంతి సందర్భంగా చిరు నివాళి 💐❤️ ♦️సాహిత్యం, సంస్కృతి అవిభాజ్యమని, వాటి ఉద్ధరణ కూడా ఏకబిగిని జరగాలని విశ్వనాథ విశ్వాసం. మన దేశ రాజకీయ రంగంలో పండిత మదన్ మోహన మాలవ్యా గారెలాంటివారో, సాహిత్య రంగంలో సత్యనారాయణ అలాంటివారు. ఎన్ని ఎదురుదాడులు తగిలినా, తాను నమ్మిన సిద్ధాంతాలను వీడలేదు. తన మతం మార్చుకోలేదు. అందుకే ఆయనొక యుద్ధనౌక. ఒక మహాశిల్పి గొప్ప ఆలయాన్ని నిర్మించ సంకల్పించాడు. ఏడు ప్రాకారాలు, గాలి గోపురం, ముఖ మండపాలు, సింహద్వారాలు,

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

Image
  "♦విశాఖపట్టణం నుండి పలాసపోవు ప్యాసింజర్ మరి కొద్ది సేపట్లో 5వ నెంబర్ ప్లాట్‌ఫాం నుండి బయలు దేరుటకు సిద్ధంగా ఉంది" అని మైకులో వినబడుతుంటే రాం నాథం మాస్టారు గబగబా పరుగెత్తి వెళ్ళి రైల్లో కూర్చున్నారు. ♦రాంనాధంగారు రిటైర్ అయిన సంస్కృత ఉపాధ్యాయుడు. విజయనగరం మహారాజా వారి సంస్కృత కళాశాలలో పనిచేసారు; ఎందరో విద్యార్థులకు విద్య గరపారు. మంచికి మారుపేరుగా అందరూ చెప్పుకుంటారు ఆయన్ని గురించి. ఎందరో పేద విద్యార్థులకు చేయూత నందించిన వ్యక్తిత్వం ఆయనది. ♦రైలు వేగం మెల్లమెల్లగా పెరుగుతుంటే ఆయన మనసు గతం లోకి పరుగులు పెడుతోంది. చాలా రోజుల తరువాత తన పుట్టినూరికి వెళ్తున్నాడు. తమ ఊరి పొలాలు, చెరువు గట్టు, శివుడి కోవెల, తను చదివిన బడి.. అన్నీ గుర్తొస్తున్నాయి. తన చిన్ననాటి తెలుగు మాస్టారు చెప్పిన "చేసిన మేలు ఊరకన్ పోదు" అనే మాట ఇప్పటికీ చెవుల్లో వినబడుతోంది. ఆ మాటే తనని ఉన్నతమైన వ్యక్తిగా సమాజంలో నిలబెట్టింది. ♦రైలు విజయనగరం చేరుతోంది. ఎవరో భిక్షగాడు "జీవము నీవే కదా..దేవా" అని పాడుకుంటూ వస్తున్నాడు. రాంనాథం గారు ఒక ఐదు రూపాయల బిళ్ళ అతని చేతిలో పెట్టారు. ♦రైలు విజయనగరంలో ఆగింది