Posts

Showing posts from January, 2021

🚩🚩గోపికా వస్త్రాపహరణం: ! (పోతన భాగవత కధ .)

Image
🚩🚩గోపికా వస్త్రాపహరణం: ! (పోతన భాగవత కధ .) #భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తరువాత, చేసిన లీలలు, అనేకము ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహరణ ఘట్టము, పరమ ప్రామాణికమయినది. బృందావనంలో వుండే గోపకాంతలు అందరూ కూడా, కృష్ణ భగవానుడినే పతిగా పొందాలని, నిర్ణయం చేసుకున్నారు. గోపకాంతలు, పూజనొక దానిని చేశారు. వారు కృష్ణుడిని భర్తగా పొందడానికి, కృష్ణుడి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుని సర్వోత్క్రుష్టమయిన ప్రతిపాదన. వారు మార్గశీర్ష మాసములో, ఒక వ్రతము చేశారు. యథార్థమునకు, భాగవతంలో, గోపకాంతలు, మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం, కాత్యాయనీ వ్రతం. వీరందరూ కలిసి, కాత్యాయనీ దేవిని, ఉపాసన చేశారు. కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి, ఆయనను ఉద్ధరించింది కాబట్టి , పార్వతీ దేవికి, కాత్యాయని అని పేరు. పార్వతీదేవిని ఉపాసన చేశారు. కృష్ణుడిని ఉపాసన చేసి, కృష్ణుని భర్తగా పొందాలి. కానీ, మధ్యలో కాత్యాయనీ దేవి పేరుతొ, పార్వతీదేవిని ఉపాసన చేస్తే, కృష్ణుడు ఎలా భర్త అవుతాడు? ఇందులోనే ఒక చమత్కారం ఉంది. ఇందులోనే ఒక రహస్యం ఉంది. శాస్త్రంలో మనకు శ్రీమన్నారాయణుడే, నారాయణిగా ఉంటాడు. నారాయణి అని, పార్వతీదేవిని పిలుస్తారు. నారాయణ, నారాయణి, వీ

🚩🚩ఏకలవ్యుడు.🚩🚩

Image
🚩🚩ఏకలవ్యుడు.🚩🚩 #మహాభారతంలో  ఏకలవ్యుని పాత్ర నిషాధ తెగకు చెంది  ఒకయువరాకుమారుడిలాప్రవేశిస్తుంది. ఏకలవ్యుడు శ్రీకృష్ణునికి తండ్రియైన వాసుదేవుని సహోదరి శృతదేవకి జన్మించిన వాడు. ఆ తరువాత అతడు నిషాధ రాజైనటువంటి హిరణ్యధనుస్సుచే పెంచబడ్డాడు.హిరణ్య ధనస్సు మగధ సామ్రాజ్యాధిపతియైన జరాసంధుని సైన్యాధిపతి. అస్త్ర విద్యలో ప్రావీణ్యం పొందగోరి ద్రోణుని అభ్యర్థించాడు.ద్రోణుడు అస్త్ర విద్యలో ఆరి తేరిన వాడు,, అర్జునుడు, అతని సహోదరులకు గురువు. కానీ ద్రోణుడు ఏకలవ్యుని స్థాయిని (కోపాన్ని అదుపులో ఉంచోకోలేడు అని, అది మనస్సులోని ఉంటచోని పైకి వేరే కారణంతో తిరష్కరించాడు) కారణంగా తిరస్కరించాడు. ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు.  ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఒక సారి విలువిద్య సాధనకు అర్జునుడు, దోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క వేగంగా, ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కొత్త వేషదారణతో ఏకలవ్యుడు కనిపంచే సరిక

🚩🚩భీష్మ ప్రతిజ్ఢ.🌹 (పోతన భాగవత కధ .).

Image
🚩🚩భీష్మ ప్రతిజ్ఢ.🌹 (పోతన భాగవత కధ .). #శంతన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు వేటాడదానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతికోసమని గంగాతీరంలో కూర్చున్నాడు. అక్కడ ఆయనకు గంగమ్మ కనపడింది. కనపడితే తన తండ్రిగారు చెప్పిన స్త్రీ ఈమెయే అనినమ్మి ఆవిడను వివాహం చేసుకోవదానికని ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు. బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని ఆవిడ వసువులకి మాట ఇచ్చి ఉన్నది. ఇప్పుడు రేపు భర్త అడ్డుగా నిలబడితే వాళ్లకి తానిచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు. అందుకని ఆవిడ అంది - "నేను నీకు భార్యను అవుతాను. కానీ నాదొక షరతు" అంది. "ఏమీ నీ షరతు" అని అడిగాడు శంతనుడు. నే ఏపని చేసినా అది శుభం కావచ్చు, అశుభం కావచ్చు. నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పనిచేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఏనాడు నాకు ఎదురుచేపుతావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాగయితే నేను నిన్ను వివాహం చేసుకుంటాను" అంది. శంతనమహారాజు బాహ్యసౌందర్యమును చూసి ప్రేమించాడు. వివాహం చేసుకున్నాడు. మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

Image
                              🚩🚩ఉషా పరిణయం.🚩🚩 పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి వేయి బాహువులు.  బాణాసురుడు ఒకరోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. అది అసురసంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి అయిదువందల వాద్య పరికరములను తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు.అతను పరుగుపరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు "నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను" అన్నాడు. అపుడు వానిలో వున్న అసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు ఎంత చిత్రమయిన కోరిక కోరాడో చూడండి. "ఈశ్వరా! నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకొక ఉపకారం చేసిపెట్టాలి. పార్వతీ దేవితో కలిసిన వాడివై, నేను కోటలోపల ఉంటె నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోర్కెలు తీర్చడంలో వశుడవయిపోయే వాడివి కదా! అందుకని నాకీ కోరిక తీరుస్తావా" అని అడిగాడు. అప్పుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కాని ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు. పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని

#మట్టి తిని బ్రహ్మండం చూపుట!! (పోతన భాగవత కథలు.)

Image
                      #మట్టి తిని బ్రహ్మండం చూపుట!!                            (పోతన భాగవత కథలు.) *ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పనిచేసుకుంటోంది. బయట బలరాముడు, ఇతర గోపబాలురు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న బాలురు గబగబా పరుగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరకు వచ్చి "అమ్మా అమ్మా నువ్వు ఎన్నోమాట్లు కృష్ణుడికి మట్టి తినకూడదని చెప్పావు కదా! తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడు" అని చెప్పారు. పిల్లలు దాక్కునే ఆట అని ఒక ఆట ఆడతారు. కృష్ణునికి అది చాలా యిష్టం. మనకి జారత్వం చోరత్వం చాలా యిష్టం. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి ఆ రెండులీలలే చేశాడు. దొంగాట ఆడేటప్పుడు ఈయన ఎక్కడో దాక్కుని ఒక్కడూ కూర్చుని మట్టి తీసి నోట్లో పోసుకునే వాడు. ఈ చర్యవలన భూకాంత పొంగిపోయేది. ఈలోగా మరొకచోట దాక్కున్న వాడు కృష్ణుడు నోట్లో మట్టిపోసుకోవడం చూశాడు. గోపబాలురందరూ కలిసి కృష్ణుని చేయిపట్టుకుని లాక్కుని యశోద దగ్గరకు తీసుకువెళ్ళారు. యశోద అదృష్టమే అదృష్టం. జీవితంలో యశోద లాంటి జన్మ ఉన్నవాళ్ళు అరుదు. యశోద దగ్గరకు పరమాత్మ వెడితే ఆవిడ అంది #మన్నేటికి భక్షించెదు? మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ యన్నయు సఖులును

# కాళియ మర్దనము (పోతన భాగవతం .)

Image
# కాళియ మర్దనము (పోతన  భాగవతం .) ఒకనాడు కృష్ణభగవానుడు గోపబాలురతో ఒక సరస్సు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. ఆ నాడు బలరాముడు కృష్ణుడితో రాలేదు. దానిని కాళింది మడుగు అంటారు. అది యమునానదిలో అంతర్భాగం. ఈ పిల్లలందరికీ దాహం వేసింది. అపుడు వారు కాళిందిలో వున్న నీరు త్రాగారు. వెంటనే వారందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణా దృష్టితో చూశాడు. అపుడు ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. ఆ నీళ్ళలోంచి ఎప్పుడూ బుడగలు వస్తుంటాయి. ఆ నీళ్ళు ఉడికిపోతున్నట్లుగా ఉంటాయి. ఆ నీటినుంచి పైకి లేచిన గాలి పీల్చినంత మాత్రం చేత పైన ఎగురుతున్న పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతూ ఉంటాయి. "ఈ నీళ్ళు ఎందుకు యిలా వున్నాయి?" అని వాళ్ళని అడిగాడు. దానికి కారణం "ఎప్పటినుంచో ఆ మడుగులో కాళియుడు అనబడే నూరు తలలు కలిగిన పెద్ద నల్లత్రాచు ఒకటి ఆ మడుగులో పడుకుని ఉంటుంది. దానికి అనేక భార్యలు. ఎందరో బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుని హింసించి తింటూ ఉంటుంది. తన విషము నంతటినీ ఆ నీటిలోకి వదులుతూ ఉంటుంది. అందువలన ఆ నీరంతా విషపూరితం అయింది" అని తెలుసుకున్నాడు. కృష్ణుడు "మీ

#ధ్రువుడు.🌹

Image
                               #ధ్రువుడు.🌹 *స్వాయంభువ మనువుకి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఉత్తానపాదుడు ప్రముఖుడు.  ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యల వలన ధ్రువుడు (సునీతి) ఉత్తముడు (సురుచి) అనే ఇద్దరు కుమారులు కలిగారు. కాలప్రభావం వలన ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ, అనురాగం ఎక్కువగా ఉండేవి. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను తండ్రి తొడ ఎక్కబోతుండగా సురుచి చూసి వెర్రి నవ్వు నవ్వి నీకు తండ్రి తొడ పై ఎక్కే అధృష్టం లేదు, అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది. నీకా అధృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెబుతుంది. ఆ పరుష భాషణానికి చింతాక్రాంతుడై ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు. అప్పుడు సునీతి ధ్రువుడితో నాయనా కాలప్రభావం వలన నీ తండ్రి తనను దాసీ కంటే తక్కువగా చూస్తున్నాడని, కష్టం కలిగించే పలుకులైన సవతి సరైన విషయం చెప్పిందని, శ్రీహరి పాదధ్యానము వలన జరగనివి ఉండవని స్వాయంభువ మనువు శ్రీహరిని ధ్యానించి ఉత

#ధ్రువోపాఖ్యానం: (పోతన భాగవతం .)

Image
#ధ్రువోపాఖ్యానం: (పోతన భాగవతం .) భాగవతంలో ద్రువోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది.  మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయమంటే మీ మనస్సు అక్కడ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కోట్ల జన్మల తరువాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందిన వాడు మాత్రమే ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానమును వింటున్నాడు. ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి. ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి. ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధ్రువుని వృత్తాంతమును వినాలి. అందునా భాగవతాంర్గతంగా వినడం అనేటటు వంటిది మరింత గొప్ప విషయం. అందునా ద్వాదశినాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ దినక్షయమునందు కానీ, అసురసంధ్యవేళ కానీ ద్రువచరిత్ర వింటే చాలా మంచిది. సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలా ధ్రువోపాఖ్యానం ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు. ధ్రువచరిత్ర ఒక ఆశ్చర్యకరమయిన సందర్భము. మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ స్వరూపమును ఒక పురుష స్వరూపమును సృష్టి చేశారు. వారే స్వాయంభువమనువు, శతరూప. వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి ఆ

🚩🚩మా తెలుగు తల్లికీ మల్లెపూదండ🔻🔻

Image
🚩🚩మా తెలుగు తల్లికీ మల్లెపూదండ🔻🔻 #తెలుగు లోనె బ్లాగండోయ్ తెలుగులోనె రాయండోయ్ తెలుగులోనె చదవండోయ్ తెలుగు మాట వినరండోయ్. #తెలుగే మన మాతృభాష తెలుగే మన ఆంధ్రభాష. తెలుగే మన జీవ శ్వాస తెలుగే మన చేతి వ్రాత. #తెలుగే మన కంటి వెలుగు. తెలుగే మన ఇంటి జోతి. #తెలుగే మన మూలధనం తెలుగే మన ఆభరణం. #తెలుగును ప్రేమించుదాం తెలుగును వినిపించుదాం తెలుగును వ్యాపించుదాం. తెలుగును రక్షించుదాం. తెలుగుకు లేదోయ్ శాపం తెలుంగు పలుకే మనదోయ్. #తెలుగన్నా, తెలుఁగన్నా, తెనుగన్నా, తెనుఁగన్నా, తెలియరొ అది తేనె వూట తెలుపరొ ప్రతి పూట పూట. #తెలుగంటే నన్నయ్యా తెలుగంటే తిక్కన్నే తెలుగంటే పోతన్నా తెలుగంటే శ్రీనాథుడు. #తెలుగంటే అల్లసాని తెలుగంటే తెన్నాలే తెలుగంటే సూరన్నే తెలుగంటే రాయలెగా. తెలుగంటే అన్నమయ్యా తెలుగంటే త్యాగయ్యే తెలుగంటే క్షేత్రయ్యా తెలుగంటే రామదాసు. #తెలుగంటే ఎంకిపాట తెలుగంటే జానపదం తెలుగంటే బాపిరాజు తెలుగంటే బ్రౌనుదొరా. #తెలుగంటే జంటకవులు తెలుగంటే శ్రీశ్రీ శ్రీపాదే తెలుగంటే పానుగంటి తెలుగంటే విశ్వనాథ. #తెలుగంటే కందుకూరి తెలుగంటే గురజాడ తెలుగంటే గిడుగేరా తెలుగంటే సీనారే. తెలుగే పాపయ్యశాస్త్రి తెలుగే గుఱ్ఱం జాషువ

ముక్కోతి కొమ్మచ్చి - 1 #సూర్యకాంతమ్మ వీలునామ !

Image
ముక్కోతి కొమ్మచ్చి - 1 #సూర్యకాంతమ్మ వీలునామా. తనకంటూ కడుపున పుట్టిన పిల్లలు లేకపోయినా, అందరినీ పిల్లలుగా భావించి లేనివారికి, వున్నవారికి కూడా అన్నదానం చెయ్యగలిగిన భాగ్యశాలి, సూర్యకాంతం గారు. కలిగినవారికి పబ్లిక్కుగా పెడితే, లేనివారికి గుట్టుగా గుంభనగా ప్రేమగా పెట్టేది, చేతులారా తినిపించేది. ఒక్క తిండేనా ! బడి ఫీజులు, పుస్తకాలు, ఉపనయనాలు, పెళ్ళిళ్ళూ, పురుళ్ళూ, బారసాలలూ, ఆస్పత్రులూ, మందులూ వగైరా కూడా... కెమెరాముందు యెంత రాకాసి అమ్మోరో, కట్ చెప్పిన తరువాత, డైనింగుహాల్లో, అంత అమ్మదనంతో ఆదరించేది. సూర్యకాంతమ్మ గారు వడ్డించే భారీ ప్రసాదాలలో, అన్నిరకాల మధురమైన వంటకాలు వుండేవి. ఆర్టిస్టులందరూ, ఇళ్లనుంచి యెంత గొప్పవంటకాలు వచ్చినా, అమ్మ ప్రసాదంగా ఆమె పెట్టేవి ఆరగించేవాళ్ళు, ఏ భేషజాలు లేకుండా. రమణగారికి చేసిన సినిమాలలో, సూర్యకాంతం గారి బుద్ధిమంతుడులోని అమాయక ఇల్లాలి పాత్రా, అందాలరాముడిలోని ఆపేక్ష చూపించే సావాలమ్మా , గోరంతదీపంలో తిరుగుబోతు మొగుడిని ఆటపట్టించే తీరూ, ఆ ఠీవీ, అందులో సింగారం, అన్నీ ఎన్నదగినవే ! సూర్యకాంతమ్మ గారికి, కళ్ళజోళ్ళన్నా, కార్లన్నా అమితయిష్టం. ఒకసారి, రమణగారు, ' అమ్మా ! మ

🌹🌺 సంగీత సామ్రాట్టు స్వాతి తిరునాళ్.🌺🌹

Image
                                     🌹🌺 సంగీత సామ్రాట్టు స్వాతి తిరునాళ్.🌺🌹 . -#ఆధ్యాత్మిక రంగంలో ఆదిశంకరాచార్యులు... హైందవ జాతి పునరుద్ధరణంలో వివేకానందుడు... ఎలాగ కృషి చేసి ప్రాత:స్మరణీయులై అతి చిన్నవయస్సులోనే పరమేశ్వరుడిలో లీనమైపోయారో!... . అలాగే కేరళ రాష్ట్రానికి చెందిన ట్రావన్కూర్ మహారాజు "స్వాతి తిరుణాళ్" కూడా సంగీతంలో విశేషమైన కృషి చేసి ముప్పై మూడవ ఏటనే పరమపదం చేరాడు. . అల్లకల్లోకంగా ఉన్న రాజకీయ, సాంఘిక పరిస్థితులు... వారసులెవరూ లేకపోతే రాజ్యాన్ని కాజేద్దామని కోట బురుజుల మీద గిరికీలు కొడ్తున్న "తెల్లదొరతనపు గద్దలు"... ఐకమత్యం లేక పరస్పరం కలహించుకుని ముక్కలు చెక్కలైపోతున్న సిగ్గులేని భరతజాతీ!... ఇలాంటి పరిస్థితుల్లో 1813 వ సంవత్సరంలో లక్ష్మీబాయి, రాజరాజ వర్మలకు ’స్వాతి’ నక్షత్రంలో పుట్టాడు..."స్వాతి తిరుణాళ్"!! పదహారో ఏటనే రాజ్యానికి వచ్చాడు గానీ.... కుట్రలూ కుతంత్రాల రాజకీయ చదరంగం ఏమీ నచ్చలేదు. ఎందుకో అతని మనసు సంగీతం వైపు మొగ్గింది. అలాంటి రాజకీయ కల్మషంలో గూడ... స్వచ్చమైన పద్మంలాగ సంగీత పరిమాళాలు గుబాళించాడు!! ఆయనో బాలమేధావి....అక్షరాలా పదహారు భ

"కళాప్రపూర్ణ శ్రీ గుమ్మడి" ! -

Image
"కళాప్రపూర్ణ శ్రీ గుమ్మడి" ! #పంచె కట్టులోన ప్రపంచాన మొనగాడు  ఎవడురా ఇంకెవడు తెలుగువాడు." హుందాగా మూర్తీభవించిన ఆంథ్రుడుగా, ప్రశాంత వదనంతో ,నిత్యం చిరునవ్వుతో ,తెలుగుదనానికి నిలువెత్తు చిరునామాగా మనకు కనిపించే మహామనిషి, శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు.  తెలుగు సినిమారంగంలో అతి చిన్న వయసులో అతి పెద్ద పాత్రలు ధరించి అలవోకగా ప్రేక్షకులను మెప్పించిన మహానటులు గుమ్మడి జులై 9 1927 న గుంటూరు జిల్లా తెనాలికి దగ్గరలోని "రావికంపాడు" గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో తల్లిదండ్రులకు మొదటి సంతానంగా జన్మించారు. ఈ మహానటుణ్ని కన్న తల్లిదండ్రులు, బసవయ్య, బుచ్చమ్మ ల పూర్వపుణ్య ఫలము వలన జన్మించిన గుమ్మడి ఇంతటి మహానటుడౌతాడని వారు ఊహించి ఉండరు. ఉమ్మడి కుటుంబంలో మొదటి సంతానంగా స్థానిక హైస్కూలు విద్య ముగియగానే వారి వ్యవసాయ వృత్తిలోనే గుమ్మడిని కొనసాగించాలని భావించారు. దైవ నిర్ణయమును ఎవరూ మార్చలేరు కదా! వారి పూర్వజన్మ సుకృతము ఊరకనే పోవునా? శ్రీ గుమ్మడి స్థానిక పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఇతనిని ప్రభావితుని చేసిన వ్యక్తి వారి తెలుగు మాస్టారు జాస్తి శ్రీరాములు చౌదరి. తరగతిలో గుమ్మడి మాట్లా

శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమునెత్తుట!!

Image
శ్రీ కృష్ణుడు గోవర్ధన పర్వతమునెత్తుట!! (పోతన భాగవతం -దశమ స్కంధము - పూర్వ భాగము.) *ఇంద్రుడికి అహంకారం వచ్చింది. "నా అంతటి వాడిని నేను - పరబ్రహ్మమేమిటి - నాకు అధికారం ఇవ్వడం ఏమిటి - నేనే వర్షము కురిపించడానికి అధికారిని" అని ఒక అహంకృతి ఆయనలో పొడసూపింది. పరమాత్మ ఇంద్రునికి పాఠం చెప్పాలని అనుకున్నాడు.  తండ్రి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పెద్దలందరూ కూర్చుని సమాలోచనలు చేస్తున్నారు. . దీనికంతటికీ మూలం ఇంద్రునికి యజ్ఞం చెయ్యడంలో ఉంది. ఆ యజ్ఞం చేత ప్రీతిచేంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. అందుకని మేము ఇంద్రునికి యజ్ఞం చేద్దామనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దామని అనుకుంటున్నాము" అన్నాడు. కృష్ణుడు ఇంద్రునికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు. అందుకోసమే ఆ సమయంలో తండ్రి వద్దకు వచ్చాను. ఇపుడు కృష్ణుడు తండ్రిని మాయచేసి మాట్లాడుతున్నాడు. అపుడు కృష్ణుడు అన్నాడు - నాన్నగారూ, నేను ఇలా చెప్పానని అనుకోవద్దు. ఎవరయినా సరే, వారు చేసిన కర్మలను బట్టి ఆయా స్థితులకు చేరుతారు. ఎవడు చేసిన కర్మ వలన వానికి గౌరవము గాని, సమాజములో ఒక సమున్నతమయిన స్థితి కాని, జ