Posts

Showing posts from October, 2021

# ***❤సాంధ్యశ్రీ..(కరుణశ్రీ)*** # ***రచన : కరుణశ్రీ*** # ***సంగీతం : ఘంటసాల***

Image
# ***❤సాంధ్యశ్రీ..(కరుణశ్రీ)*** # ***రచన : కరుణశ్రీ*** # ***సంగీతం : ఘంటసాల*** # ***గానం : ఘంటసాల*** # ***అది సంధ్యా సమయం.*** # ***మల్లె పందిరి పూస్తున్నది.*** # ***కోయిల కూస్తున్నది.*** # ***కవి కుమారుడు కరాలు చాచి,*** # ***కరుణామయుని లాలిస్తున్నాడు.*** # ***01)|| ఉత్పల మాల ||*** # ***అంజన రేఖ , వాల్ కనుల - అంచుల దాట , మనోఙ్ఞ , మల్లికా*** # ***కుంజములో , సుధా, మధుర - కోమల , గీతిక లాలపించు , ఓ*** # ***కంజదళాక్షి !నీ , ప్రణయ - గానములో , పులకింతునా !! మనో*** # ***రంజని ! పుష్ప వృష్టి పయి - రాలిపి , నిన్ , పులకింప జేతునా!!!*** # ***02)|| ఉత్పల మాల ||*** # ***క్రొంజికురాకు వ్రేళుల,కు - రుల్,తడి యార్పుచు గూరుచున్న, అ*** # ***భ్యంజన మంగళాంగి , జడ - లల్లుదునా ! మకరంద , మాధురీ*** # ***మంజుల , మామక , ప్రణయ - మానస భావనలే , ప్రపుల్ల పు*** # ***ష్పాంజలి జేసి ,నీ అడుగు - లందు , సమర్పణ జేసి కొందునా!*** # ***03)|| ఉత్పల మాల ||*** # ***ఓ.......ఒ..ఒ..ఓ...........ఒ...ఒ...ఓ.....*** # ***సంజ వెలుంగులో , పసిడి - ఛాయల , ఖద్దరు చీర గట్టి, నా*** # ***రింజకు నీరు వోయు ,శశి - రేఖవె నీవు ! సుభద్ర సూతినై*** # ***

🚩🚩తెనాలి వారి విన్యాసం!🚩🚩

Image
విన్నవేయైనా కొన్ని మరల మరల వినాలనిపిస్తుంది. అందులో మనవికటకవి తెనాలి రామకృష్ణుని కవితా విన్యాస మొకటి. అలాంటి సంఘటనే యొకసారి రాయల సభలో జరిగింది. దానిని వారెలా యెదుర్కొన్నారో మన మిప్పుడు తెలిసికొందాం. " #ప్రగడ రాజు నరసరాజనే" గొప్ప పండితుడు ఒకనాడు రాాయల సభకు వచ్చాడు.రాయలకు నమస్కరించి,"ప్రెభూ నేనెరుగని గ్రంధములేదు, యేపద్యమునకైనను సునాయాసముగా నర్ధమును జెప్పగలను. మీయాస్థానమున పెద్దనాది కవీంద్రులు కలరుగదా వారెవరైన నాతో వాదముచేయగలరా?లేనిచోృజయ పత్రమిప్పించుడు" అనిపలికెను. అంత రాయలు తెనాలిివారివంక జూచి కన్నుగీటెను. అంతే మన వికటకవిలేచి విజృభించెను. " నరసరాజా! పెద్దలు వారిదాకాయెందుకు? ముందు నన్నుగెల్వజాలిన నాపై వారి విషయమును జూచికొనవచ్చును. ఏమీ తామెరుంగవిగ్రంధములేదా?మాయొద్దనొకగ్రంధమున్నది.*దానినిప్పుడే దంప్పింతును ."అనిసేవకులకేదోఞచెప్పిపంపెను.వారొక పల్లకీలో నొకగ్రంధమును చీనాంబరమున గప్పి దెచ్చిరి. " అయ్యాగ్రంధమువచ్చివది. దీనిపేరు మీరెరుగుదురేమో చెప్పుడు.ఆపైగ్రంధవివరణ మొనర్పవచ్చుననెను." గ్రంధముపేరడుగ ' #తిలకాష్ఠ మహిషబంధనము ' అనిచెప్ప నాపండితుడు దిక్క

🚩🚩బుడుగు🚩🚩

Image
✍️నా పేరు బుడుగు. మరో పేరు పిడుగు. మా బామ్మ నన్ను హారి పిడుగు అంటుంది. అమ్మ పోకిరి వెధవ, ఒక్కొక్కసారి వెధవకానా అంటుంది. నాన్న దొంగ రాస్కల్ అంటాడు. ఇలా ఎవరి ఇష్టానుసారం వాళ్లు ఆయా సందర్భాలకనుగుణంగా నా పేరు మార్చేస్తుంటారు. నేనే మంచి వాణ్ణి కదా పాపం అందుకని ఎవరు ఎలా పిలిచినా పలికేస్తుంటాను. నా గురుంచి ఎవరో చెపితే నాకు నచ్చదు. అందుకే నా గురించి నేనే చెపుతాను. వినండి. నేను ముళ్లపూడి వారి మానస పుత్రుడను చిచ్చుల పిడుగును. నాకో అమ్మ పేరు రాధ, నాన్న పేరేమో గోపాలం, బామ్మ, పెళ్లికాని బాబాయి (వీడు రెండుజెళ్ల సీత వస్తుంటే విజిల్ వేయమంటాడు. వీడి దగ్గర బోళ్లని లవ్ లెట్రలుకూడా ఉన్నాయి). నాకో స్నేహితురాలు కూడా ఉంది తెలుసా. దాని పేరు సీ గాన పెసూనాంబ (శ్రీ జ్ఙాన ప్రసూన్నాంబ). వీరుకాక బోళ్లంతమంది ప్రవేట్ మాస్టార్లు, లావుపాటి పక్కింటి పిన్నిగారు, పిన్నిగారి మొగుడు వీళ్లందరితో వేగలేక నేను. ఏంచెప్పమంటారు నా కష్టాలు. చిన్నపిల్లాణ్ణి నాకు కష్టాంలేంటి అనుకుంటున్నారా. చిన్న పిలల్లకే అని కష్టాలునూ. అమ్మ తిట్లు, నాన్న చీవాట్లు, మాస్టారు మొట్టికాయలు! మాస్టార్లకసలు తెలివుండదు. ఒక మేష్టారేమో చెవి కుడివైపుకు మెలిపెడత

🚩🚩అయ్యరు గారి.. IQ టాబిలెట్స్. !!

Image
  భారత దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఆ రోజుల్లో ఒక అయ్యరు గారు మద్రాసు నుంచి కలకత్తాకు హౌరా మెయిల్లో వెడుతున్నారు. అదే బోగీలో ఓ ఆంగ్లేయుడు కూడా ప్రయాణం చేస్తున్నారు. తెల్లారేసరికి రైలు బెజవాడ స్టేషన్ చేరుకుంది. ఉన్నత తరగతిలో ప్రయాణించే వారికి రైల్వే వారు స్పెన్సర్ బ్రేక్ ఫాస్ట్ ఉచితంగా అందించేవారు. ఆ బ్రిటిషర్ దాంతో కడుపు నింపుకున్నారు. అయ్యరు గారు మాత్రం ఇంటి నుంచి తెచ్చుకున్న నాలుగు గిన్నెల టిఫిన్ క్యారియర్ విప్పి అందులో ఒక గిన్నెలోని రెండు ఇడ్లీలు తీసి తినడం, ఆ ఆంగ్లేయుడు గమనించాడు. తెల్లగా, గుండ్రంగా ఉన్న ఆ పదార్ధం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఆయనలో మొదలయింది. అయితే అడగడం మర్యాదగా ఉండదని మిన్నకుండిపోయాడు. మధ్యాన్నానికల్లా రైలు వాల్తేరు చేరుకుంది. రైల్వే వాళ్ళు ఆంగ్లేయుడికి చక్కటి, రుచికరమైన భోజనం అందించారు. అయ్యరు గారు రైల్వే భోజనాన్ని మృదువుగా తిరస్కరించి తన క్యారియర్ తెరిచి రెండో గిన్నెలో వున్న మరో రెండు ఇడ్లీలు కమ్మగా తినడం, ఆ బ్రిటిష్ వ్యక్తి గమనిస్తూనే వున్నాడు. యెంత ఆలోచించినా తోటి ప్రయాణీకుడు తింటున్నవేమిటి అనేది ఆయనకు అర్ధం కాలేదు. దాంతో

🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!! 👉🏿 (వింజమూరి . 3)

Image
 🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!! 👉🏿 (వింజమూరి . 3) కరి దిగుచు మకరి సరసికి కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ !! 👉🏿 నానానేకప యూధముల్ వనము లోనన్ పెద్ద కాలంబు స న్మానింపన్ దశ లక్ష కోటి కరిణీ నాధుండ నై యుండి మ ద్దానాంభః పరిపుష్ట చందన లతాంతచ్చాయ లందుండ లే కీ నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా !! 👉🏿 కలడందురు దీనుల యెడ కలడందురు భక్త యోగి గణముల పాలం గలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో !! 👉🏿 లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !! 👉🏿 ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై? ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !! 👉🏿 లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !! 👉🏿 అల వ

🚩 గ జేంద్రమోక్షము - పరమార్ధం 🚩 (వింజమూరి -2.)

Image
  🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 ♦భగవంతుని నమ్మిన వారి కెన్నడు కూడ నాశము లేదని చెప్పడమే భాగవతం యొక్క పరమార్ధం . ❤ నన్ను మఱువని వారిని నేను ఏనాడు మరువను. ‘నన్ను మఱచిన యెడలన్ మఱతును.’ ఈ సంగతి తెలుసుకొని ఇతరులను వేడకుండా నన్నే నమ్మి ప్రార్థించిన వారిని నేను తప్పక ఆదుకుంటాను. ‘యెఱిఁగి మొఱఁగక మఱవక మొఱ యిడిర యేని ’ వారిని కాపాడతానంటాడు పరమాత్మ. ♦తనను మర్చిపోయిన వారిని తాను మర్చిపోతానని, తనను నమ్ముకున్న వారిని తాను ఆదుకుంటానని “ స్పష్టంగా చెప్పాడు శ్రీమహాలక్ష్మి తో శ్రీమహావిష్ణువు ఈ గజేంద్రమోక్షఘట్టం లో. (8-130). ♦" నీవే తప్పనిత: పరంబెరుగన " నే ఆత్మసమర్పణ భక్తునిలో కలిగినప్పుడే భగవత్సాక్షాత్కారం జరిగేది. అదే విషయాన్ని గజేంద్రమోక్ష ఘట్టం మనకు సవివరంగా విశదీకరిస్తుంది . ♦అంతేకాదు.భక్తుడు కర్మపరతంత్రుడై నిత్యకృత్యాలను నిర్వహించుకుంటూనే విష్ణువు ను సేవించగలగాలి. ఈ నియమాలను పాటిస్తే మెల్లగా పాపాలన్నీ నశించిపోతాయి. ప్రబలమైన విష్ణుభక్తి ఎప్పుడు నాశనము కాదు. ” ప్రబలమైన విష్ణుభక్తి సెడదు “(8-126). అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. దైవబలం లేనందువల్లనే గుణ రహితులైన దుర్జనులకు ఏనుగులు ,గుఱ్ఱాలు

🚩🚩 భగవద్గీత- ఘంటసాల - N T R - విశ్వనాథ . 🚩🚩

Image
 🚩🚩 భగవద్గీత- ఘంటసాల - N T R - విశ్వనాథ . 🚩🚩 (ప్రతి బొడ్డూడని వాడూ భగవద్గీతకి వ్యాఖ్యానం వ్రాసేవాడేనాయె !) ♦అది 1974వ సంవత్సరం. మే నెల 21వ తారీకు,  విజయవాడ దుర్గా కళామందిరంలో కీ.శే. ఘంటసాల పాడిన భగవద్గీత గ్రామఫోను రికార్డు ఆవిష్కరణ ఆవిష్కరించేది. నటరత్న ఎన్.టి.రామారావు. ♦" సభ విజయవాడలో పెట్టేటట్టయితే అక్కడ మా గురువుగారు విశ్వనాథవారున్నారు. వారిని ఆహ్వానించండి. మొదటి రికార్డు వారికి ప్రెజంటు చేద్దాం అని రామారావుగారు కూడా అన్నారండి. తమరు దయచేసి మా - ఆహ్వానాన్ని మన్నించాలి" అని హెచ్.ఎమ్.వి. కంపెనీ అధికారులు కొందరు వచ్చి పిలవగా సరే నన్నారు, కవి సామ్రాట్  విశ్వనాథ  సత్య నారాయణ  గారు. ♦పాపం, గురువుగారు బతికున్నన్న నాళ్లూ విజయవాడలో ఏ సినిమా సభ జరిగినా, ఆయనని ఆహ్వానింపించి నాలుగక్షింతలు వేయించుకోకుండా ఉండలేదు ఏనాడూ ఆ నటరత్న! ♦ఆ రోజుకి సభా నిర్వాహకులు వచ్చారు.  . కళామందిరం హాలే కాక,  స్టేజీ కూడా కిటకిట లాడిపోతోంది. ఎన్.టి. ఆరూ, తదితరులూ విశ్వనాథ వారికి నమస్కారాలతో ఎదురొచ్చి రిసీవ్ చేసుకోగా  అంతా ఆసీను లయ్యారు. ♦పూలమాలలూ, ఫార్మాలిటీలూ అన్నీ అయినాయి.  నిర్వాహకులూ, మరి కొందరు పెద్దలూ

🚩 కళాపూర్ణోదయం -7: శల్యాసురుడు!🚩

Image
( జరిగిన కథ – రెండు నెలల పసిపాప మధురలాలస తన పూర్వజన్మల కథల్ని చెపుతూ కళాపూర్ణుడి తల్లి మగవాడు, తండ్రి స్త్రీ అని చెప్తుంది. అందరూ ఆశ్చర్యంతో అదెలా జరిగిందో చెప్పమంటారు. ఆమె సుముఖాసత్తి మణిస్తంభులు అతని కన్నవారని, ఆ వృత్తాంతం వివరిస్తోంది. సుముఖాసత్తిని మణిస్తంభుడు కాళికాలయంలో బలి ఇచ్చి నప్పుడు ఆమె “నా మాట నిజమయ్యేట్టు చూడు” అని చివరి మాటగా అని మరణించినందువల్ల అది నిజమై ఆమె మాట వరసకి అన్న మాట “నువ్వు స్త్రీవి ఐతే నేను పురుషుడి నౌతాను” అనేది అక్షరాల జరుగుతుంది. అలా సుముఖాసత్తి మణిస్తంభుడి గాను, మణిస్తంభుడు సుముఖాసత్తి గాను రూపాంతరాలు చెందుతారు. ఇక చదవండి) 🚩 “అలా మారిన సుముఖాసత్తీ మణిస్తంభులు సింహవాహనం మీద ఆకాశంలో తిరుగుతూ ఒక అద్భుతమైన నగరాన్ని చూశారు. అప్పుడు సుముఖాసత్తి (రూపంలో వున్న మణిస్తంభుడు) “ఇది ఎంతో మనోహరమైన పురం, నేనిదివరకు ఒకసారి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కొన్నాళ్ళు ఉండి వెళ్దామని అనిపిస్తున్నది” అన్నది. అని తన సింహవాహనాన్ని నేలకు దించింది. వాళ్ళిద్దరూ ఊరిబయట నడుస్తున్నారు. సరిగ్గా అప్పడే ఆ పట్టణానికి రాజైన సత్వదాత్ముడు వాహ్యాళికి వెళ్ళి వస్తూ ఆమెను చూసి మనసు పారేసుకున్నాడు.

🚩🚩 🚩 కళాపూర్ణోదయం -6: బ్రహ్మలోకం!🚩🚩 *

Image
🚩🚩 🚩 కళాపూర్ణోదయం -6: బ్రహ్మలోకం!🚩🚩 * ( జరిగిన కథ – సుముఖాసత్తి సుగాత్రి అనీ మణిస్థంభుడే శాలీనుడనీ తేలిపోతుంది. అలఘువ్రతుడనే వాడు కళాపూర్ణుడి కథ తెలులుకోవాలనే కోరికతో భువనేశ్వరీదేవి జపం చేస్తాడు. మణికంధరుడు కలభాషిణిని దేవికి బలిస్తాడు. ఆమె బతికి ద్వారకలో తనవాళ్ళతో కలుస్తుంది. మణికంధరుడు భృగుపాతానికి శ్రీశైలం వెళ్తాడు – తన దగ్గరున్న రత్నమాలికని అలఘువ్రతుడికిచ్చి. రెండేళ్ళ తర్వాత అలఘువ్రతుడు ఎగిరిపోయి ఓ రాజసభలో పడి తన దగ్గరున్న రత్నమాలికని ఆ రాజుకి కానుకగా ఇస్తాడు. దాన్ని అక్కడే తొట్టిలో ఉన్న రెండు నెలల బాలిక మెళ్ళో వేస్తారు. హఠాత్తుగా ఆ బాలికకు పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. తను క్రితం జన్మలో కలభాషిణి నంటూ అంతకు ఆ జన్మకన్నా ఇంకా ముందటి జన్మలో జరిగిన విశేషాల గురించి చెప్పటం మొదలు పెడుతుంది. ఇక చదవండి.) 🚩 “#సరస్వతీదేవి మందిరంలో నేను ఉండేటప్పుడు ఒక రోజు భవనం బయట ఒక సరస్సు! దాన్లో హంసల బొమ్మలు! మధ్యలో ఒక గొప్ప మాణిక్య స్తంభం! పక్కన బంగారపు సోపానాలు! ఆ సరస్సు పక్కనే లేత కల్ప వృక్షాల నీడలో పూలపానుపు మీద బ్రహ్మ! ఆయన పాదాలు తన తొడల మీద పెట్టుకుని ఒత్తుతూ శారద! హఠాత్తుగా ఆమెని ముద్దాడాలన్న