Posts

Showing posts from June, 2022

🔻-గుణనిధి కథ.-🔻 (కాశి ఖండం-శ్రీనాధుడు (క్రీ.శ 1360 - 1450))

Image
 🔻-గుణనిధి కథ.-🔻 (కాశి ఖండం-శ్రీనాధుడు (క్రీ.శ 1360 - 1450)) 🚩దారితప్పిన యువకులను పాత్రలుగా మార్చి... అంతర్గతంగా వ్యక్తిత్వ వికాసానికి దారిచూపే రచనలు చేసినవారిలో ఆద్యుడు శ్రీనాథుడు. ఆయన గుణనిధి, సుకుమారుడు అనే రెండు పాత్రలను సృష్టించాడు. ఈ వరుసలో అందరికంటే ముందు పుట్టింది ‘గుణనిధి’. అయినా తెనాలి రామకృష్ణుని ‘నిగమశర్మ’కు అధిక ప్రాచుర్యం లభించింది. ఎవరైనా దుర్వ్యసనాల పాలైతే ‘‘వాడా! వాడు నిగమశర్మ’’ అంటాం. అయితే మన సాహిత్యంలో మదాలసుడు, నిరంకుశుడు, నాగదత్తుడు అనే మరో మూడు భ్రష్ట యువకుల పాత్రలూ కనిపిస్తాయి. ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డా చివరికి అప్రయత్నంగా దేవుని మహిమతో మోక్షాన్ని పొందిన ఇలాంటి కథలను తామస కథలు అంటారు. వాటిలో మొదటిది ‘గుణనిధి కథ’. ఇది శ్రీనాథుడు రచించిన ‘కాశీఖండం’లోనిది. పేరుకు పెద్దన్న... 🚩కాంపిల్యనగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడి కుమారుడే గుణనిధి. చాలా అందగాడు. కానీ, చదువు వదిలిపెట్టి పేకాట నేర్చాడు. విటులతో స్నేహం పెంచుకొన్నాడు. ఆచారాలను వేళాకోళం చేయడం, హోమాలంటే మండిపడటం, గీత వాద్య వినోదాల్లో కాలం గడపడం, అనకూడని మాటలను పదే పదే ఉచ్చరించడం చేసేవాడు. కోడిపందేలు, పాచికలాటల్లో ఆ

🔴-ఋణోదయం-🔴

Image
                                                                                                         🔴-ఋణోదయం-🔴 “# అప్పు “ అనగానే చప్పున గుర్తొచ్చేది అప్పారావు. అప్పారావంటే మరెవరో కాదండీ… సాక్షాత్తు మన ముళ్ళపూడి వెంకటరమణ గారే. ♦మిత్రుడు ‘బాపు ‘ దగ్గర అప్పులు చేసీ,చేసీ అప్పారావు పాత్రను సృష్టించాడు. అన్నట్టు 💰 డబ్బులు మాత్రమే కాదండోయ్...జీవితానికి సరిపడ 'స్నేహాన్ని ‘ కూడా బాపు నుంచి అప్పుగా తీసుకున్నాడు.అందుకేనేమో?అప్పుల అప్పారావు పాత్రను అంత సజీవంగా చిత్రీకరించాడు ముళ్ళపూడి. ♦నవ్వడం భోగం,నవ్వక పోవడం రోగం ‘ ,అన్నారు జంథ్యాల.నవ్వడం,నవ్వించడం మరిచి నవ్వుల పాలవుతున్న తెలుగోడికి మళ్ళీ నవ్వడం ఎలాగో నేర్పించాడు మన ముళ్ళపూడి.పిల్లల కోసం ♦బుడుగు “ ను,పెద్దవాళ్ళ కోసం “అప్పారావును “ సృష్టించితెలుగువాళ్ళ రుణం తీర్చుకున్నాడు .ఆకలేస్తే కేకలేశాడు “ శ్రీ శ్రీ , ఆకలేస్తే జోకులేశాడు ముళ్ళపూడి.వీళ్ళిద్దరిదీ 'ఫుడ్డు ‘ ప్రాబ్లమే.’ ఆకలి ‘ ఇద్దరిలోనూ కామన్.అయితే …స్వభావాల్ని బట్టి ♦ ఒకరిది ‘ కేక ‘ అయితే..ఇంకొకరిది ‘ జోక్ ‘ అయింది. ♦తెలుగు సాహిత్యంలో అప్పుల ప్రస్తావన వస్తే ‘ నక్షత్రకుడు ‘ గుర్త

🚩🚩​అడవుల పాలైన సీత!!

Image
                                              🚩🚩​అడవుల పాలైన సీత!! (అంతా శూన్యం. - బైటా, మనసు లోపలా కూడాఉత్తర రామాయణంలో సీత.🙏) తే. #రమణి మరి కొంత వడి దాఁక రథము జూచు దరుణి మరి కొంత సేపు కేతనముఁ జూచు గాంత మరి మీద రథ పరాగంబుఁ జూచు బడఁతి మరి యంతటను వట్టి బయలు జూచు.❤ 🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋 . ♦పై పద్యం కంకంటి పాపరాజు వ్రాసిన ఉత్తర రామాయణం లోనిది. . రాజాజ్ఞ తెలిపి, ఆమెను వదిలివేయడంతో తన పని పూర్తయిన లక్ష్మణుడు “ దుఃఖిస్తూ నమస్కరించి, గంగ ఆవలి తీరంలో వుంచిన రథమెక్కి బయలుదేరిపోతాడు. అప్పుడు ఆ రథాన్ని చూస్తూ అలానే వుండిపోయింది సీత. నింద వలని బాధా, రాముని చర్యపట్ల దుఃఖమూ, హఠాత్తుగా జరిగిన పిడుగుపాటు లాంటి ఆఘాతం వలని దిగ్భ్రమా, భయమూ, ఈ అరణ్య మధ్యంలో ఒక్కసారిగా వదిలేసి పోయినారే దైవమా, అనే నిస్సహాయతా – ఆ నిమిషం వరకూ వున్న లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతుండడంతో పై భావాలన్ని ఆమెను ఒక్కసారిగా ముప్పిరిగొనగా నిలువు గుడ్లతో లక్ష్మణుని రథం పోయిన వైపే చూస్తూ ఉండిపోయింది. రథం దూర దూరంగా వెళ్ళిపోతున్నది. ఆమె రథాన్నే చూస్తున్నది. క్రమక్రమంగా అది కనిపించకుండా పోయింది. ఇప్పుడు రథం పైన ఎగురుతున్న కేతనం మాత్రము కొం

❤️🌹❤️ ‌‘హాస్య‌బ్రహ్మ’‌ జంధ్యాల.❤️🌹❤️

Image
‌ ‘‌ ‘✍🏿మాటలు రాయ‌డ‌మంటే మాటలు కాదు’‌’‌ అని  నమ్మి, హాస్యా‌నికీ.‌.‌.‌ అప‌హా‌స్యా‌నికి మధ్య ఉన్న  సున్ని‌త‌మైన రేఖను గమ‌నించి సంభా‌ష‌ణా‌శ్రయ  హాస్యాన్ని సృష్టిం‌చ‌డంలో పేరు‌పొం‌దిన పద‌హా‌ర‌ణాల  తెలుగు రచ‌యిత, దర్శ‌కుడు జంధ్యాల!❤️ ✍🏿ఇంటి‌పే‌రుతో ప్రసి‌ద్ధు‌డైన జంధ్యా‌లను మీ అసలు  పేరే‌మిటి.‌.‌.‌ అని ఎవ‌రైనా అడి‌గితే ఆయన చెప్పే సమా‌ధానం ఆయ‌న‌లోని సహ‌జా‌త‌మైన హాస్య‌దృ‌క్ప‌ధా‌నికి నిద‌ర్శనం.‌  ‌‘‌‘నేను రామా‌నా‌యుడి సిని‌మాకు పని‌చే‌సే‌ట‌ప్పుడు నా పేరు జంధ్యాల రామా‌నా‌యుడు, విశ్వ‌నాథ్‌ సిని‌మాకు పని‌చే‌సే‌ట‌ప్పుడు నా పేరు జంధ్యాల విశ్వ‌నాథ్‌.‌.‌.‌’‌’‌ అని చెప్పే జంధ్యాల పూర్తి పేరు జంధ్యాల వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి.‌  ✍🏿సిరి‌సి‌రి‌మువ్వ సిని‌మాతో మాటల రచ‌యి‌తగా సినీ రంగ ప్రవేశం చేసిన జంధ్యాల, 1983లో 12 నెలల వ్యవ‌ధిలో 80 సిని‌మా‌లకు మాటలు రాసి ఒక సరి‌కొత్త చరిత్ర సృష్టిం‌చారు.‌ అతి తక్కువ సమ‌యంలో, ఒక సిని‌మాకు సంపూ‌ర్ణంగా సంభా‌ష‌ణలు సమ‌కూ‌ర్చ‌గ‌లి‌గిన మాట‌కారి జంధ్యాల.‌ తెలుగు సాహిత్యం మీదా, వాడుక భాష‌మీదా ఉన్న విశే‌ష‌మైన పట్టుతో ‌‘సిరి‌సి‌రి‌మువ్వ’, ‌‘సీతా‌మా‌లక్ష్మి’, ‌‘శుభో‌

🔴 భర్త - స్థితి,గతి-పరిణామక్రమాలు....!🔴

Image
1)లేలేత’భర్తలు:  భార్య చుట్టూ తిరుగుతూ ఉండడం.. భార్య చూపు తగిలితే చాలనుకోవడం.., ”అసలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ పెళ్ళవదు”,అనుకోవడం..! భార్య దగ్గరే స్వర్గం ఉంది అని భావించడం.. అసలు సృష్టిలో భార్య,తను తప్ప ఎవ్వరూ లేరనుకోవడం...! అన్నీ పనులూ వచ్చని చెప్పడం..! తమ జీవితంలో సంఘటనలన్నీ,అడిగినా అడక్కపోయినా స్వచ్ఛందంగా,అమాయకంగా ఉన్నది ఉన్నట్టు  భార్యకు చెప్పేసుకోవడం..! కొన్ని బలహీన క్షణాల్లో ..భవిష్యత్తు ఊహించక భయంకర వాగ్ధానాలు చేయడం.. “ఈ దశ పెళ్ళైన పదహారు రోజుల పండగ వరకు ఉంటుంది..!” } 2)దోర’భర్తలు: పదహార్రోజులంత ఉత్సాహం ఉండదు కానీ , కొంత పచ్చి మిగిలుంటుంది.... “అన్నీ చెప్పేసామే..! కొన్ని దాచ వలిసిందే “అని అలోచిస్తూ ఉండడం.. పర్లేదులే పరాయిది కాదుకదా కట్టుకున్న భార్యేగా అర్థం చేసుకుంటుంది లే ,అయినా మా మధ్య రహస్యాలు ఉండకూడదు” అని నమ్మకంగా ఉండటం.. కాస్త బాహ్య ప్రపంచంలో వేరే మనుషులు కూడా కంటికి కనపడుతూ ఉండడం. భార్యని చీటికి మాటికి సినిమా-షికార్లకి తిప్పడం.. అడక్కపోయినా చీరలు -నగలు కొనిస్తూ ఉండడం..! భార్యకి చిన్నగాయం అవడానికి కొన్ని క్షణాల ముందునుండే కంగారు దిగులు.. కళ్ళల్లో నీళ్ళు తెచ్చేసుకోవడం..

🚩"సుందరదాసు' ఎమ్. ఎస్. రామారావు - MS Ramarao .!

Image
🚩"సుందరదాసు' ఎమ్. ఎస్. రామారావు - MS Ramarao .! ♥️ ఎమ్. ఎస్. రామారావు పేరు చెప్పుకోగానే గుర్తుకొచ్చేవి  వీరు అద్భుతంగా గానం చేసిన, తెలుగునాట విశేషంగా  ప్రాచుర్యం చెందిన సీతా రామకథ. 'హనుమాన్ చాలీసా', 'సుందరకాండ". ♦️ఎమ్మెస్ రామారావు 1921 మార్చి 7 న గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామంలో జన్మించారు.  అడవి బాపిరాజు గారి ప్రోత్సాహంతో చలన చిత్ర రంగంలో ప్రవేశించి  1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తహసీల్దార్ చిత్రంలో  మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించారు. ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన సి.హెచ్. నారాయణరావుకు ఇది గాత్రదానం. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం గా చెప్పుకుంటుంటారు.  తరువాత ఈయన దీక్ష, ద్రోహి, మొదటిరాత్రి, పాండురంగ మహత్యం, నా యిల్లు, సీతారామ కల్యాణము, శ్రీరామాంజనేయ యుద్ధము మొదలైన సినిమాలలో పాడారు.   ♦️ "ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో:--- ఈ లలితగీతాన్ని ఎం.ఎస్.రామారావుగారు రచించి,స్వరపరచి, గానం చేశారు.దీనికి బ్యాక్ గ్రౌండ్ ట్యూన్ పెండ్యాల నాగేశ్వరరావుగారు కంపోజ్ చేశారు. ♦️1952

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ!

Image
"బ్రాహ్మీమయ మూర్తి .మహాకవిసామ్రాట్టు"..విశ్వనాధ సత్యనారాయణ ''తన కావ్యం ప్రతివాడూ గొప్పదంటాడు. ఎవరో నా 'ఏకవీర' ఉత్తమమని అన్నారు..నేను ఉత్తమమని ఎందుకనాలి?ఒక తరం పోయి మరొక తరం వచ్చినట్టు చెప్పిన'వేయి పడగలు' గొప్పది కాదా? దాని గుణ గణాలు ఎవరైనా పరిశీలించారా?ఎంతో సైకాలజీ గుప్పించిన 'చెలియలి కట్ట' ఏమైనట్టు? 'పురాణ వైర గ్రంధ మాల' లో ఒక్కొక్క నవలలో ఒక్కొక్క శిల్పం చూపానే! ఎవరైనా చూశారా? మన ప్రమాణాలునిలుస్తాయా? ఎంతో పోయె..దేవాలయాలే కూలి పోయె! ''...అని కుండ బ్రద్దలుకొట్టినట్లు చెప్పిన వాడు.. ''రామాయణ కల్ప వృక్షాన్ని మించిన కవిత్త్వం ఉండదు..సర్వ శక్తులూ పెట్టి వ్రాశాను..పరమేశ్వరుడు అనుగ్రహించాడు..నారాయణుడే పరమేశ్వరుడు..'' అన్న ధీశాలి, జ్ఞాని...జ్ఞాన పీఠానికి ఘనతను తెచ్చిన ప్రజ్ఞాన ఖని.. '' సనాతన ధర్మం రాదు..కానీ..వేద మతానుసరణం తప్పదు..ఆది వినా ప్రపంచ శాంతిఉండదు..ఏ ఇజమూ గట్టెక్కించదు ..వేదిజం ఒక్కటే శరణ్యం..'' అని నిష్కర్షగాచెప్పిన వాడు... ''ఇంగ్లీషు లో ఏ రవీంద్రుడి లాగానో..ఇలియట్స్ లాగానో కవితా భాష వ్

*' (ముళ్ళపూడి వెంకటరమణ ' టీ ' వాలా కథ) పరిచయం:.)

Image
🌷టీ వాలా గురించి బాపు-రమణలు అప్పుడే ఊహించారండోయ్.🤣 🏵️ బేటి వాలా .రోటీ వాలా ...మధ్యలో టీ వాలా ఎలా వచ్చేడో చెప్పే కధ🌷  (యువ 1964.) *' (ముళ్ళపూడి వెంకటరమణ ' టీ ' వాలా కథ) పరిచయం:.) ☕   ☕   ☕   ☕   ☕ ఒకూళ్ళో రోటీవాలా, బేటీవాలా అని ఇద్దరు శత్రువులుండేవారు. పదవులకోసం ఇద్దరూ పోటీ పడుతూ ఉండేవారు. ఓసారి మునిసిపల్ ఎలక్షన్ కి ఇద్దరూ పోటీపడి ప్రచారం సాగిస్తుంటే ఇంతలో టీవాలా పోటీలో కి వచ్చాడు. ' నా మీద ఓడితే నువ్వోడాలి తప్ప,ఆడోడితే నాకేం గొప్ప ' అని ఇద్దరికిద్దరూ అనుకుని టీవాలా మీద దండెత్తారు  టీవాలా పోటీనుంచి తప్పుకుని బేటీవాలాతో కలిశాడు. రోటీవాలా బేటీవాలా లిద్దరూ మళ్ళీ పుంజుకుని పోటీకి సిద్ధపడ్డారు. ఆవేశాలు పెరిగాయి. బేటీవాలా చివరి రోజున పెద్ద మొత్తంలో నోట్లు జల్లాడు. దానిముందు ఆగలేని రోటీవాలా మౌనంగా ఉండి పోయాడు. కానీ చివరికి  *బేటీవాలా ఓడాడు.* *రోటీవాలా గెలిచాడు.* *టీ వాలా బాగుపడ్డాడు.* *...ఎలా ?*  బేటీవాలా నోట్లు పంపకం పూర్తికానిచ్చి పొద్దుపోయా క రోటీవాలా అవన్నీ దొంగనోట్లని పుకారు లేవదీశాడు. టీవాలా ఇంటింటికీ వెళ్లి ' దొంగనోట్లని పుకారొచ్చిందని పోలీసులొచ్చి పట్టుకుంటా

🚩🚩-*సువాసిని పూజ *(చిన్న కథ .)

Image
  🚩🚩-*సువాసిని పూజ * (చిన్న కథ .) ♦️రాములవారి కోవెలలో నుండి “కౌసల్యా సుప్రజారామా… పూర్వాసంధ్యా ప్రవర్తతే…” అని కాలనీ అంతా ప్రతిధ్వనిస్తోంది.  ధ్వజస్తంభాల మీద వాలిన పక్షులు కోరస్ పాడుతున్నాయి…  తెలి మంచు కరిగి తొలి భాను కిరణాలతో ప్రకృతి పులకరిస్తుండగా… నల్లరాతి విగ్రహం నడకలు నేర్చి వస్తున్నట్లుగా, మంచి నీళ్ళ బిందె చంకన పెట్టుకుని, గుడి మెట్లు ఎక్కి అరుంధతి నడిచి వస్తూ కనిపించింది. ♦️గర్భగుడిలో నిర్మాల్యాన్ని తొలగిస్తున్న గణపతిశాస్త్రి “ఇంకా అరుంధతమ్మ రాలేదేవిటా? అనుకున్నాను… ఆ మడి నీళ్ళు  అక్కడ పెట్టు… మీ అత్తగారి కెలా వుందీ?” అని అడిగాడు. ఆమె బిందె కింద పెట్టి, నడుముకి దోపిన కొంగుతో మొహం తుడుచుకుంటూ వుండగా, కుంకుమ మొహం అంతా పరచుకుని, గర్భగుడిలో ఇద్దరు అమ్మవారి మూర్తులున్నట్లు ప్రకాశించింది.  కానీ… ఆమె చెయ్యెత్తినప్పుడు ఎర్రని రవికెకి వున్న చిరుగు ఆమె దైన్యాన్ని చెప్పకనే చెప్పింది! ♦️వెలసి మాసికలు పడ్డ ఆకుపచ్చ చీర, శివాలయం ప్రాంగణంలో దుమ్ము పరుచుకున్న నాగమల్లి చెట్టు ఆకుల్లా, శుశ్రూష లేని తులసికోటలా, వెలసిన కపిరాజు జెండాలా, కనిపించింది! “అత్తయ్య మూసిన కన్ను తెరవడం లేదు! ఆర్.ఎం.పి. డాక

గోపయ్య నల్లనా.. ఎందువలనా?

Image
. "అమ్మా.."   "ఏం కన్నయ్యా!" అని అడిగింది యశోదమ్మ కృష్ణుడిని.  "నాకు కోపమొచ్చింది" "కోపం అంటే ఏంటి, కన్నయ్యా?" "ఏమో! వచ్చింది. అంతే!"  "సరే, వచ్చింది లే!" "ఉహూ, ఎందుకూ? అని అడుగు" "హ్మ్" "హ్మ్మ్ కాదు, "ఎందుకు కన్నయ్యా?" అని అడగాలి" "అడిగాను లే , చెప్పు" "నన్ను నల్ల వాడని అన్న నవ్వాడు." "పోన్లే, అన్నేగా!" "వల్లభుడు కూడా నవ్వాడు. నీలమణీ నవ్వాడు." "నవ్వనీలే నాన్నా. వాళ్ళని తెల్లవాళ్ళని నువ్వూ నవ్వు." "మరి నువ్వూ తెల్లగా ఉంటావూ!" "అయితే!" "అందరూ తెల్లగానే ఉంటారు. నా అంత నల్లగా ఎవరూ ఉండరు."  "నీ అంతవాడివి నువ్వే కన్నా!" "అంటే?" "గొప్పవాడివనీ.." "గొప్ప కాదు నల్లవాడినట." "అయితే ఏం? నీ కళ్ళంత అందమైన కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? నీ జుత్తు చూడు ఎంత నల్లగా, పట్టు కుచ్చులా ఉందో!"  "జుత్తు కాదు అమ్మా.. నల్ల నల్ల వాడిని ఎందుకూ? చూడు, నువ్వు తెలుపు. పాలు తెలుపు. వెన్న తెలుపు