Posts

Showing posts from October, 2020

❤️🚩గీతాంజలి స్వీయ కధ .🚩❤️

Image
                                             ❤️🚩గీతాంజలి  స్వీయ కధ .🚩❤️ ✍🏿నా జన్మస్థలం రాజమండ్రి. మా నాన్నగారి పేరు శ్రీరామ్మూర్తి. అమ్మ శ్యామలాంబ. మేం ఇద్దరు అక్కా చెల్లెళ్ళం. నాన్నగారు నాకు పెట్టిన అసలు పేరు మణి, మా అక్క పేరు స్వర్ణ.   నా తొలి చిత్రం నన్ను సినిమాల్లో చేర్పించాలని నాన్నగారికి కోరిక ఉండేది. ప్రముఖ నృత్య కళాకారుడు, నృత్య దర్శకుడు వెంపటి సత్యం గారి దగ్గర నేను భరత నాట్యం నేర్చుకునేదాన్ని. అదే సమయంలో దర్శకులు బి.ఎ.సుబ్బారావుగారు ‘రాణీరత్నప్రభ’ చిత్రం నిర్మిస్తున్నారు. ఆ చిత్రంకోసం నాట్యకళాకారులు కావాలని సుబ్బారావుగారు అడగటంతో, మా గురువు వెంపటి సత్యం గారు నాతో సహా నలుగురిని పంపించారు. మా నలుగురిచేతా బిట్లు బిట్లుగా డ్యాన్స్‌ చేయించారు. ఇందులో నాది భరత నాట్యం పాత్ర.   హీరోయిన్‌గా తొలి చిత్రం ‘రాణీరత్నప్రభ’ చిత్రంలో రామారావుగారు కథానాయకుడు. అంజలీదేవి గారు కథానాయిక. ఈ సినిమాలో నా భరతనాట్యం చిత్రీకరణ కోసం మా నాన్నగారు నా వెంట సహాయంగా వచ్చారు. నా నృత్య ప్రదర్శన షాట్ల చిత్రీకరణ పూర్తయింది. అప్పుడే ఎన్‌.టి.రామారావుగారు నన్ను చూశారు. అప్పటికప్పుడే. రామారావుగారు, కమలాకర కామేశ్వరర

శోభనాచల: వింజమూరి అనసూయా దేవి గారి గేయాలు

Image
శోభనాచల: వింజమూరి అనసూయా దేవి గారి గేయాలు : vinjamuri anasuya devi అవసరాల (వింజమూరి) అనసూయా దేవి గారు ఆలపించిన రెండు గేయాలు వినండి. vinjamuri anasuya devi ఏమే చి.. .🚩🚩శిథిలాలయమ్ములో శివుడు లేడోయి!🚩🚩 ............. లోక మందిరమునకు పునాది రూపాన్ని అన్వేషించ యత్నించిన భావుకుడు మన దేవుల పల్లి క్రిష్ణ శాస్త్రి. ఆ అన్వేషణా భారంతో ఎంతగా డస్సి పోయాడో కదా పాపం! ఆ భావ కవీంద్రుడు. "భావనా" గవేషణా లాలిత్య లయలతో సాగిన ఆయన గీతం ఇది. ( లైబ్రరీలలో 4 నెలల పాటు గాలించీ ........ గాలించీ ....... హమ్మయ్య! ఇప్పటికి దొరికింది నాకు, ఈ పాట! ) పాఠక మిత్రులకై ఇదిగో! స్వీకరించండి! ) **************************************** శిథిలాలయమ్ములో శివుడు లేడోయి! ప్రాంగణమ్మున గంట పలుక లేదోయీ! దివ్యశంఖము గొంతు తెరవ లేదోయి పూజారి గుడి నుండి పోవ లేదోయి! చిత్ర చిత్రపు పూలు – చైత్ర మాసపు పూలు ఊరూరా, ఇంటింట ఊరకే పూచేయి - శిథిలాలయమ్ములో శిల కెదురుగా కునుకు పూజారి కొకటేని పువ్వు లేదోయి వాడ వాడల వాడె, జాడలన్నిట వాడె వీడు వీడున వాడె, వీటి ముంగిట వాడె శిథిలాలయమ్ములో శిల కెదురుగా కునుకు పూజారి వానికై ప

🚩🚩పులి ముగ్గు”🚩🚩 (విశ్వనాథ సత్యనారాయణ రాసిన గ్రాంథిక నవల .)

Image
  🚩🚩పులి ముగ్గు”🚩🚩 (విశ్వనాథ సత్యనారాయణ రాసిన గ్రాంథిక నవల .) ఈ నవలకు విశ్వనాథ ఎన్నుకున్న అంశం వింతైనది, కొత్తది, పైగా జానపదం!! మనిషి పులిగా మారే విద్య మీద రాసిన నవల. ఖడ్గ విద్య లో ఎదురు లేని ఒక క్షత్రియ తాపసి, అంతులేని స్త్రీ వాంఛతో అసంబద్ధమైన శృంగార పరమైన కోరిక కోరి నాశనమైన రాజు.., నీచుడైన తండ్రికి తగిన పాఠం చెప్పిన కొడుకు… ఇలాటి పాత్రలతో ఆద్యంతం ఉత్కంఠ గా సాగే నవల పులి ముగ్గు! కథ ప్రారంభమే మగధ సామ్రాజ్య సేనాధిపతి శ్రీముఖ శాతకర్ణీ, అతనికి పరిచయస్తుడైన తోహారు అనే ఒక ఆటవికుడూ కలిసి, సగం మనిషీ సగం పులి గా మారిన ఒక ప్రాణి కోసం అన్వేషణ సాగిస్తూ ఒక కారడవి లో పయనించడం తో మొదలౌతుంది. నిజానికి వాళ్ళు అన్వేషిస్తున్న వ్యక్తి వెనుక కాళ్ళు మనిషి కాళ్ళు గా ఉంటాయి తప్ప మిగతా మొత్తం పులిగా మారగలడు. మరి కొంత సాధన మిగిలి పోయి వెనుక కాళ్ళు మాత్రం మనిషి కాళ్ళుగానే ఉండి పోయిన మనిషి .అంటే మనిషీ పులీ కలగల్సిన ఒక వింత వ్యక్తి కోసం వాళ్ల అన్వేషణ ఆ జీవి కోసం ఓపిగ్గా తిరిగి తిరిగి అలసిన ఇద్దరూ ఒక పెద్ద తటాకం ఒడ్డున పులి,మనిషి పాదాల గుర్తులు గమనించి, అక్కడ ఒక చెట్టెక్కి మాటు వేస్తారు. తెల్లవారు జామున వాళ్ళె

🚩🚩అజామిళోపాఖ్యానం:🚩🚩

Image
  ✍🏿ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడే ఒక నగరం వుండేది. ఆ నగరంలో ఒక శ్రోత్రియుడయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనమును ఆచరించి వేదవేదాంగములను తాను పఠించి పదిమందికి వేదమును వివరణ చేస్తూ పదిమందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితమును గడపగలిగిన సమర్థుడు అయినవాడు. యాదృచ్ఛికముగా ఆయనకు ఐశ్వర్యము సమకూరింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుని యందు రమించే స్థితిని కలిగి వున్నవాడు. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు #అజామీళుడు. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం ఆయనకు ఒక ఉత్తమమయిన సౌందర్యవతియైన కన్యను తెచ్చి వివాహం చేశారు. ఆయన శీలం ఎటువంటిది? పుట్టినపుడు గతంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులమున జన్మించాడు. సత్కర్మ అంటే చేసిన పని. యజ్ఞోపవీతం వుంది, సంధ్యావందనం చేసి గాయత్రీమంత్రం జపించేవాడు. ఈవిధంగా అతడు జ్ఞానమును పొందినవాడు. శాంత లక్షణమును కలిగి ఉన్నాడు అజామీళుడు సత్యభాషణా నియమమును పెట్టుకున్నాడు. ధర్మమును వదలలేదు. నిత్య నైమిత్తిక కర్మలను వదిలి పెట్టలేదు. ఈవిధంగా అజామీళుడు రాశీభూతమయిన బ్రాహ్మణ తేజస్సు. #ఇప్పుడు అజామీళుడికి యౌవనం అంకు

🚩🚩ఆంధ్రకవుల అపరాధాలు.🚩🚩

Image
🚩🚩ఆంధ్రకవుల అపరాధాలు.🚩🚩                                 ‘ఆంధ్రకవుల అపరాధాలు’ పద్యాలు మొట్టమొదటగా  ఆంధ్రపత్రిక కాళయుక్తినామ సంవత్సర ఉగాది (1918)  సంచికలో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత 1965లో ఆ పత్రిక స్వర్ణోత్సవ సంచికలో పునర్ముద్రితమయ్యాయి.  ఇందులో #నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, తిమ్మన, పింగళి సూరన, #తెనాలి రామకృష్ణుడు లాంటి హేమాహేమీలందరినీ #వేంకట రామకృష్ణ కవులు అధిక్షేపాత్మక ధోరణిలో విమర్శించారు.        వ్యాస భారతాన్ని తెనిగించటానికి నన్నయ పూనుకున్నాడు. తెలుగు ప్రజలకు తొలి గ్రంథాన్ని అందించాలనుకున్నాడు. అంటే కవిత్వాన్ని సంస్కృత భాష నుంచి తెలుగు వైపు మళ్లించే ఒక గట్టి ప్రయత్నం మొదలుపెట్టాడు. అంతవరకు బాగుంది. మరి అలాంటప్పుడు భారతాన్ని చక్కటి తెలుగు పద్యంతో ప్రారంభించకుండా ‘#శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’’ అన్న సంస్కృత శ్లోకంతో ఎందుకు ప్రారంభించాలి అంటూ వేంకట రామకృష్ణ కవులు తమ మొదటి  అస్త్రాన్ని ఆదికవిపైనే సంధించారు.. #ఆంధ్ర లోకోపకారము నాచరింప  భారతమ్మును నన్నయ భట్టు తెలుగు  జేయుచున్నాడు సరియే బడాయిగాక తొలుత సంస్కృత పద్య మెందులకు జెపుడి       బడాయి కాకపోతే నన్నయ తెలుగు భారతాన్న

🚩🚩నేల రాలిన తారల కధ .🚩🚩

Image
🚩🚩నేల రాలిన తారల కధ .🚩🚩 🌹పాకుడురాళ్ళు-డాక్టర్ రావూరి భరద్వాజ 🌹 #పాకుడురాళ్ళు రావూరి భరద్వాజ విశిష్టమైన నవలా రచన. చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. #భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశాడు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ ల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే వ్రాసిన #పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా వ్రాశాడు. ఈ నవల మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రిక లో ధారావాహికగా వెలువడినది. ఈ పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి ఈ నవల రాసినందుకు రావూరికి 2013 లో సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈ పాకుడు రాళ్ళు వంటి సినీ ప్రపంచం నుండి జారి పడి, నేల రాలిన తారలని కాసేపు ఇక్కడ గుర్తు చేసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్ నటి #మార్లిన్ మన్రో స్లీపింగ్ పిల్స్ వేసుకుని చనిపోవడం మనకందరికీ తెలిసిందే! పాకీజా లాంటి అద్భుత కళాఖండంలో నటించిన #మీనా కుమారి తాగుడుకి బానిసై చన

🚩🚩తెనాలి వారి కవితా విన్యాసం!🚩🚩

Image
🚩🚩తెనాలి వారి కవితా విన్యాసం!🚩🚩 👉🏿విన్నవేయైనా కొన్ని మరల మరల వినాలనిపిస్తుంది. అందులో మనవికటకవి తెనాలి రామకృష్ణుని కవితా విన్యాస మొకటి.  అలాంటి సంఘటనే యొకసారి రాయల సభలో జరిగింది. దానిని వారెలా యెదుర్కొన్నారో మన మిప్పుడు తెలిసికొందాం.  "#ప్రగడ రాజు నరసరాజనే" గొప్ప పండితుడు ఒకనాడు రాాయల సభకు వచ్చాడు.రాయలకు నమస్కరించి,"ప్రెభూ నేనెరుగని గ్రంధములేదు, యేపద్యమునకైనను సునాయాసముగా నర్ధమును జెప్పగలను. మీయాస్థానమున పెద్దనాది కవీంద్రులు కలరుగదా వారెవరైన నాతో వాదముచేయగలరా?లేనిచోృజయ పత్రమిప్పించుడు" అనిపలికెను. అంత రాయలు తెనాలిివారివంక జూచి కన్నుగీటెను. అంతే మన వికటకవిలేచి విజృభించెను. " నరసరాజా! పెద్దలు వారిదాకాయెందుకు? ముందు నన్నుగెల్వజాలిన నాపై వారి విషయమును జూచికొనవచ్చును. ఏమీ తామెరుంగవిగ్రంధములేదా?మాయొద్దనొకగ్రంధమున్నది.*దానినిప్పుడే దంప్పింతును ."అనిసేవకులకేదోఞచెప్పిపంపెను.వారొక పల్లకీలో నొకగ్రంధమును చీనాంబరమున గప్పి దెచ్చిరి. " అయ్యాగ్రంధమువచ్చివది. దీనిపేరు మీరెరుగుదురేమో చెప్పుడు.ఆపైగ్రంధవివరణ మొనర్పవచ్చుననెను." గ్రంధముపేరడుగ ' #తిలకాష్ఠ మహి

🚩గ జేంద్రమోక్షముయొక్క పరమార్ధం 🚩

Image
🚩గ జేంద్రమోక్షముయొక్క పరమార్ధం 🚩 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 భగవంతుని నమ్మిన వారి కెన్నడు కూడ నాశము లేదని చెప్పడమే భాగవతం యొక్క పరమార్ధం . “ నన్ను మఱువని వారిని నేను ఏనాడు మరువను. ‘నన్ను మఱచిన యెడలన్ మఱతును.’ ఈ సంగతి తెలుసుకొని ఇతరులను వేడకుండా నన్నే నమ్మి ప్రార్థించిన వారిని నేను తప్పక ఆదుకుంటాను. ‘యెఱిఁగి మొఱఁగక మఱవక మొఱ యిడిర యేని ’ వారిని కాపాడతానంటాడు పరమాత్మ. తనను మర్చిపోయిన వారిని తాను మర్చిపోతానని, తనను నమ్ముకున్న వారిని తాను ఆదుకుంటానని “ స్పష్టంగా చెప్పాడు శ్రీమహాలక్ష్మి తో శ్రీమహావిష్ణువు ఈ గజేంద్రమోక్షఘట్టం లో. (8-130). " నీవే తప్పనిత: పరంబెరుగన " నే ఆత్మసమర్పణ భక్తునిలో కలిగినప్పుడే భగవత్సాక్షాత్కారం జరిగేది. అదే విషయాన్ని గజేంద్రమోక్ష ఘట్టం మనకు సవివరంగా విశదీకరిస్తుంది . అంతేకాదు.భక్తుడు కర్మపరతంత్రుడై నిత్యకృత్యాలను నిర్వహించుకుంటూనే విష్ణువు ను సేవించగలగాలి. ఈ నియమాలను పాటిస్తే మెల్లగా పాపాలన్నీ నశించిపోతాయి. ప్రబలమైన విష్ణుభక్తి ఎప్పుడు నాశనము కాదు. ” ప్రబలమైన విష్ణుభక్తి సెడదు “(8-126). అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. దైవబలం లేనందువల్లనే గుణ రహితులైన

🚩గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన.🚩

Image
🚩గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన.🚩 👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿💥👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿 తత్వవిచారణతో సద్యోఫలితం అందుకున్న వారిలో గజేంద్రుడు అగ్రగణ్యుడు. ఆయన లాగ తత్వవిచారాన్ని చేసి ఉన్న ఫళంగా పరమాత్మ సాక్షాత్కారం పొందినవారిలో మొదటివాడు. మిగతా అందరికి ఆదర్శప్రాయుడు. గజేంద్రుడి పేరుతో శ్రీ వ్యాసుల వారు, శ్రీ పోతన గారు మనకు తత్వవిచారాన్ని పరిచయం చేసి, ఏవిధంగా దాన్ని చేయాలి, ఎటువంటి ప్రశ్నలు వేసుకోవాలి, ఏవిధమైన జవాబులు రాబట్టుకోవాలి, మన ఆలోచనలని, భావాలని ఏవిధంగా మలచుకోవాలి, ఏవిధమైన భావపరంపరలతో ముందుకు సాగితే గమ్యమైన పరమాత్మను చేరుతాము అన్న విషయాలను చాలా చక్కగా తెలియ జేసారు. ఇప్పుడు మనం శ్రీమద్భాగవతంలో గజేంద్రుడు పేరుమీద వ్యాసులవారు, పోతనగారు మనకు ఇచ్చిన తత్వవిచార భాండాగారాన్ని ఒక క్రమంలో పరిశీలిద్దాం. వారిద్దరూ ఒకే భావాన్ని ఏవిధంగా వ్యక్త పరిచారు, వ్యాసులవారు చెప్పినవాటిలో పోతనగారు వేటిని చెప్పారు, వేటిని వదిలివేసారు, ఇంకా వేటిని చెప్పారు, వీటన్నిటిని కూడా పరిశీలించి, వారి దృక్పధాన్ని తెలుసుకొంటూ తత్వవిచారాన్ని మన మనస్సులలో నాటుకొనేటట్లు చేసుకొందాం. ముందరగా వ్యాసభాగవతంలోని