Posts

Showing posts from October, 2022

🚩🚩-రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారి పొట్టి కధలు

Image
  (కొన్ని కధల పరిచయాలు .) ♦️వైవిధ్యమైన కథాసాహిత్యానికి వెలిగే సూర్యుడు రాచకొండ విశ్వనాథశాస్త్రి. ఆయన కథల్లో అక్షరాలకు గొంతులుంటాయి. దృశ్యాలన్నీ వాస్తవికత స్వరాల తో, గాయాలతో ఉన్న బాధల్ని గానం చేస్తాయి. ఆయన కథల్లో పేదరికం కార్చిన కన్నీరు పాఠకుల అరచేతుల్లో దీనమైన రూపమై మిగులుతుంది. నిత్యం అచేతనంగా ఉండే మనిషి ఆలోచనలు ఆయన కథల చైతన్యంతో సరిహద్దు సైనికుల్లా తయారవుతాయి. అసంఖ్యాకమైన కథా సంపదకు దాతగా నిలిచిన రావిశాస్త్రి కలం అందించిన పదునైన సాహితీ భాండాగారం ఈ పొట్టి కథలు. 1979- 1980 ప్రాంతంలో 'స్వాతి' మాసపత్రికలో ప్రచురించబడిన ఈ కథలకు శీర్షికలు ఉండవు, కాని వాటి శిరస్సుల నిండా దట్టించిన సామాజిక ఆలోచన మన చూపుల్ని క్రొత్త మార్గాల వైపు నడిపిస్తుంది. రండి ఒక్కసారి ఆ రహదారుల దృశ్యాలలో మనం ఒక దృశ్యమై కదులుదాం. ♦️పేదరికంతో పస్తులున్న పాక అది. అందులో ఆకలితో ఒక పసికూన అలమటిస్తోంది. బువ్వకోసం అమ్మను, నాన్నను అడిగింది. కన్నీళ్ళతో ఖాళీగిన్నెలు చూపించారు. చేసేదిలేక ఆకలిని భరించలేక 'ఆకలేస్తుంది, బువ్వ పెట్టండని' ఎండిన డొక్కతో ప్రభుత్వాన్ని అడిగింది. మట్టికొట్టుకు పోయిన ఆ ముఖాన్ని చూసి ప్రభుత్

🚩🚩-పులి ముగ్గు”!! - (విశ్వనాథ సత్యనారాయణ రాసిన గ్రాంథిక నవల .)

Image
ఈ నవలకు విశ్వనాథ ఎన్నుకున్న అంశం వింతైనది, కొత్తది, పైగా జానపదం!! మనిషి పులిగా మారే విద్య మీద రాసిన నవల. ఖడ్గ విద్య లో ఎదురు లేని ఒక క్షత్రియ తాపసి, అంతులేని స్త్రీ వాంఛతో అసంబద్ధమైన శృంగార పరమైన కోరిక కోరి నాశనమైన రాజు.., నీచుడైన తండ్రికి తగిన పాఠం చెప్పిన కొడుకు… ఇలాటి పాత్రలతో ఆద్యంతం ఉత్కంఠ గా సాగే నవల పులి ముగ్గు! కథ ప్రారంభమే మగధ సామ్రాజ్య సేనాధిపతి శ్రీముఖ శాతకర్ణీ, అతనికి పరిచయస్తుడైన తోహారు అనే ఒక ఆటవికుడూ కలిసి, సగం మనిషీ సగం పులి గా మారిన ఒక ప్రాణి కోసం అన్వేషణ సాగిస్తూ ఒక కారడవి లో పయనించడం తో మొదలౌతుంది. నిజానికి వాళ్ళు అన్వేషిస్తున్న వ్యక్తి వెనుక కాళ్ళు మనిషి కాళ్ళు గా ఉంటాయి తప్ప మిగతా మొత్తం పులిగా మారగలడు. మరి కొంత సాధన మిగిలి పోయి వెనుక కాళ్ళు మాత్రం మనిషి కాళ్ళుగానే ఉండి పోయిన మనిషి .అంటే మనిషీ పులీ కలగల్సిన ఒక వింత వ్యక్తి కోసం వాళ్ల అన్వేషణ ఆ జీవి కోసం ఓపిగ్గా తిరిగి తిరిగి అలసిన ఇద్దరూ ఒక పెద్ద తటాకం ఒడ్డున పులి,మనిషి పాదాల గుర్తులు గమనించి, అక్కడ ఒక చెట్టెక్కి మాటు వేస్తారు. తెల్లవారు జామున వాళ్ళెదురు చూస్తున్న పులి రానే వస్తుంది. తుప్పల్లో దాచిన కొయ్య తెప్పను త

🙏🏻🙏🏻అన్నదమ్ముల సఖ్యత - స్త్రీ_వైశిష్ట్యం :-🙏🏻🙏🏻

Image
  55 ఏళ్ళు అన్నయ్యకు, 50 ఏళ్ళు తమ్ముడికి. అన్నయ్య ఇంటికి తమ్ముడెళ్ళడు, తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళడు. ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమనే భావన ఈ జన్మకు ఆ ఇద్దరి తోటే కదా.. 55 ఏళ్ళు వస్తే నువ్వు మహా బతికితే 70 ఏళ్లు వచ్చేవరకే.. ఆ తరువాత నీవు స్వతంత్రంగా తిరగలేవు. ఆ తరువాత మరో 15 ఏళ్ళు బతుకగలవేమో... అప్పుడప్పడూ వెళ్ళేది లెక్కేసుకున్నా ఈ శరీరం ఉండగా మహా అయితే బహు కొద్ది సార్లు మాత్రమే నీ తమ్ముడింటికి వెళ్ళగలవు. ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టుకు చస్తారు? అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడెంత ప్రేమగా మెలిగారో అలా చెయ్యి చెయ్యి పట్టుకుని, పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సంతోషంగా కలిసి మెలగలేరా... నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా ఆ బంధం తాలూకు మాధుర్యం జీవితంలో మళ్ళీ వస్తుందా... పోగొట్టుకున్న తరువాత ఏడ్చి ఉపయోగం ఏమిటి ? రాముడు పుష్పక విమానం లోంచి దిగుతుంటే లక్ష్మణ స్వామి, భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందకు దింపుతుంటే... విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు .. ‘‘నా అన్న రావణుడు కూడా మహానుభావుడు.. సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు.. పది తలలున్నవాడు. ఘోరమైన తపస్సు చేసినవాడు. కాంచన లంకాధిపతి. లో

గోడగూచీ కథ... ***************

Image
పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్తుడుండేవాడు అతడు మహా శివ భక్తుడు.రోజు తమ ఊళ్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు.ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్లేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా అరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు.ఇలా పరమనిష్ఠతో ప్రతిదినం కుంచెడుపాలను శివుడికి అరగింపు చేసేవాడు.స్వామిని అర్చించేవాడు.ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది.దాంతో తాను నిష్ఠగా చేసే శివ పూజ ..శివుడికి పాలని నివేదించే పని ఎలాగా, అని ఆలోచించాడు .ఇంట్లో అందరికన్నా చిన్నదైనా కూతురిని దగ్గరికి పిలిచాడు. పాపా!మేము ఊరికి వెళ్తున్నం.ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు .ఇంకో ముఖ్యమైన పని అదేంటంటే మనం రోజూ శివాలయంలో శివునికి పాలను అరగింపు చేసేవాళ్ళం.ఆ పని కూడా నువ్వు చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవుపాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికివెళ్లాలి, అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి.వెళ్తావు కదూ! ఇది మన నియమము తల్లీ!వ్యర్థం కానివ్వకు. ఆటలని, పా

🚩🚩-రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారి కధాలోకం !! (కొన్ని కధల పరిచయాలు .)

Image
♦️ఆఖరి దశ ! ✍️చరిత్రలోని భిన్న దశలను తీసుకుని విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించిన కధ. శ్రీకృష్ణుడు విష్ణువు అవతారం. రాజకీయవేత్తగా అధర్మంగా భీముడితో దుర్యోధనుణ్ణి చంపిస్తాడు. అర్జునుడితో యుద్దం చేయిస్తాడు. అధ ర్మంతో అన్యాయకాలం దాపురించిందనుకుంటారు శైవులు.  శంకరాచార్యు లతో బ్రాహ్మణ మతం నుల్లీ పునరుద్ధరణ పొందింది. ఇక ప్రపంచానికి చివరి దశే అనుకుంటారు బౌద్దులు. కాఫర్ల విజృంభణతో, తెల్లవాళ్ల ఆగమనంతో మొగల్‌ సామాజ్యానికే కాదు ప్రపంచానికే ఆఖరి రోజులు వచ్చాయనుకుంటారు మొగల్‌ రాజ్యం అండతో (బ్రతికినవాల్లు. భారతదేశంలో తమ రాజ్యం పోవడంతో ఇక ప్రపంచమంతా కుక్కల, నక్కల పాలవుతుందని, ప్రపంచానికి ఆఖరి దశ సమీపించిందని అనుకుంటారు ఇంగ్రీషువాళ్లు. "ప్రపంచం సాగుతూనే ఉంది ఇన్ని వేలసంనత్సరాలనుంచీ, ఇన్ని యుగాల నుంచి అన్న వ్యాఖ్యతో కధ ముగుస్తుంది. ♦️ -“కోర్టుకురానిసాక్షులు' ✍️ న్యాయవ్యవస్త స్వరూపాన్ని చిత్రించిన రావిశాస్త్రి మొదటి కధ. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య తనతో కాపురానికి రావాలని కేసు వేస్తాడు ఒక మగవాది. తను అసలు పెళ్లాడలేదంటుంది ప్రతివాది. వాది తరఫున పెల్లి జరిగినట్టు పురోహితుడూ, పెద్ద మనుషులూ సాక్ష్యం ఇస

🚩🚩తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర చిత్రణ🚩🚩

Image
#శ్రీకృష్ణుని అష్టభార్యలలో సత్యభామ పాత్ర చిత్రణ తెలుగునాట సాహిత్యంలో విశిష్టమైన పాత్ర సంతరించుకొంది. స్వాధీనపతికయైన నాయుక గాను, సరస శృంగారాభిమానవతిగాను, విభునికి తనపైనున్న ప్రేమకారణంగా గర్వం మూర్తీభవించినదానిగాను సత్యభామ పాత్రను చిత్రీకరించారు. #పోతన భాగవతం> పోతన భాగవతంలో నరకాసుర వధ సందర్భంగా సత్యభామ పాత్రను అందమైన పద్యాలలో చిత్రీకరించాడు. యుద్ధం సమయంలో ఆమె హరునికి ప్రియశృంగారమూర్తిగాను, శత్రువుకు భీకర యుద్ధమూర్తిగాను ఒకేమాఱు దర్శనమిచ్చిందట.. #నంది తిమ్మన పారిజాతాపహరణం #తులాభారం కూచిపూడి నాట్యం, #భామా కలాపం తెలుగు సినిమాలలో #శ్రీకృష్ణ తులాభారం, #శ్రీకృష్ణసత్య, #దీపావళి అంటి అనేక తెలుగు సినిమాలు సత్యభామ పాత్ర ప్రాముఖ్యతతో వెలువడినాయి. సత్యభామ వర్ణన🌹 🌺🌺 మ. అరి జూచున్ హరి జూచు జూచుకములం దందంద మందార కే సరమాలామకరందబిందుసలిలస్యందంబు లందంబులై తొరుగం బయ్యెద కొం గొకింత దొలగం దొడ్తో శరాసారమున్ దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేలీగతిన్ పై పద్యం ఉత్తర హరివంశ కావ్యం లోనిది. నాచన సోమనాథుడు రచించినది. చాలా ప్రసిద్ధమైన పద్యం. హరివంశాన్ని మహాభారతానికి పరభాగంగా భావిస్తారు. ఇందులో శ్రీకృష్ణుని బా

లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము🌹🔻

Image
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము (రచించినవారు ఆది శంకరాచార్యులు.) ఆయురారోగ్యాలను ప్రసాదించే స్తోత్రం ఈరోజు తప్పక చదవండి ! శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగింద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత లక్ష్మీలసత్ కుచసరోరుహ రాజహంస లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ సంసారసాగర విశాల కరాళకామ నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకర మృగ ప్రవరార్దితస్య ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ సంసారకూప మతిఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ సంసారభీకర కరీంద్ర కరాభి ఘాత నిష్పీడ్యమానవపుష స్సకాలార్దితస్య ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ సంసార సర్పవిషదుష్ట భయోగ్రతీవ్ర దంష్ట్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తేః నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ సంసారజాలపతితస్య జగన్నివాస సర్