Posts

Showing posts from March, 2021
Image
🚩🚩'‘పుష్కరాల రేవులో పుల్లట్లు’🚩🚩 (బి.వి.ఎస్. రామారావు) సేకరణ -ఆంధ్రజ్యోతి (దీపావళి) సంచిక నుండి - #వెన్న కాచినప్పుడు గోకుడు వస్తుంది.  ఆ గోకుడిని గోదావరిఅంటారు. ఆ గోదావరికి వుండే రుచే...  ఈ గోదావరి కథలకూ వుంది.  అలాంటి కథలలో పెద్ద కథ.. పుల్లట్లంత రుచికరమైన కథ... అల్లం పచ్చడిలా జుర్రుకోవాలనిపించేంతగానోరూరించే కథ  #పుష్కరాల రేవులో పుల్లట్లు’ కథ. అయితే... ఈ కథలో పుల్లమ్మ పాత్ర చిత్రణఅణగారిన వర్గ నేపథ్యమే అయినా మనసుకు హత్తుకొంటుంది. ఇది పుల్లమ్మ ప్రేమ కథ.  ఆడది ఒకసారిమనసారా ప్రేమిస్తే... తాను ప్రేమించినోడి కోసం, తన ప్రేమను సాకారం చేసుకోడం కోసం ఎంతటిత్యాగానికైనా వెనుదీయదని చెప్పడానికి పుల్లమ్మే ఉదాహరణ. తాను ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. తనవ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తుదివరకూ పోరాటం చేస్తుంది. “ప్రవాహంలో తరంగాల్లా ఎన్నో జీవితాలు కాలప్రవాహంలో సాగిపోతుంటాయి. తరంగానికిదిగువ మనకి కనపడని మరొక తరంగం ఉంటుంది,  ఆ తరంగ శక్తే మనం చూస్తున్న తరంగాన్నినడిపిస్తుంది.  అలాగే మనమెరిగిన వ్యక్తుల జీవితాల వెనుక మనమెరుగని  ఎన్నో బాధలూ కథలూ దాగిఉంటాయి. .  #రాజమండ్రి పుష్కరాల రేవులో పుల్లట్

🚩🚩 -'ఎసరూ- అత్తిసరూ' - 🚩🚩 (బి.వి.ఎస్. రామారావు)

Image
🚩🚩 -'ఎసరూ- అత్తిసరూ' - 🚩🚩 (బి.వి.ఎస్. రామారావు) #గోదావరి గాలి సోకినా , గోదావరి నీళ్ళు తాగినా , ఆ ప్రాంతపు మట్టి వాసన పీల్చినా చాలు… ఆ గోదారి కెరటాల్లా హృదయంలో ఏవేవో అనుభూతులు చెలరేగుతాయి. ఆ అనుభూతులని ఒడిసి పట్టి, వాటిని అందమైన భావాలుగా కవిత్వీకరించో, కథలుగా మార్చో ఎందరో కవులూ , రచయితలూ తమతమ సాహితీ కేదారాలను సస్యశ్యామలం చేశారు.  నేటికీ గోదావరీ నది కేంద్రంగా తెలుగులో అనంతమైన సాహితీ రసఝరి నాలుగు దిక్కులా ప్రవహిస్తూనే ఉంది. ఒకరా… ఇద్దరా..? ఎందరి పేర్లు చెప్పగలం? ఎన్నని రచనలు ఉదాహరించగలం? వందల సంవత్సరాలుగా వేలాదిమంది భావుకులకు గోదావరి ఆలంబనగా నిలుస్తూనే ఉంది. మధురమైన రచనలను సృష్టించడానికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంది. అలాగే ఎందరో చలనచిత్ర దర్శకులు గోదావరి అందాల్నీ, అక్కడి మనుషుల జీవితాలనీ చక్కటి దృశ్యకావ్యాలుగా మలిచి ప్రజలని పరవశింప చేశారు. ముఖ్యంగా  ఆదుర్తి, కె. విశ్వనాథ్, వంశీ , బాపు-రమణ వంటి వారలు గోదావరి నేపథ్యంగా గొప్ప చిత్రాలు నిర్మించారు. #బాపు- రమణలకు ,  సీతారామం అని పిలుచుకునే బాల్య స్నేహితుడు ఒకాయన ఉన్నారు. ఆయన పూర్తిపేరు–  భావరాజు వెంకట సీతారామారావు.  ఈయన మద్రాసు ‘ కేసరి&

💥సూర్య నమస్కార మంత్రాలూ:💥

Image
  💥సూర్య నమస్కార మంత్రాలూ:💥 ధ్యేయ: సదా సవిత్రు మండల మధ్య వర్తీ, నారాయణ సరసిజానన సన్నివిష్ట: కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ, హరీ హిరణ్మయ వపు: ద్రుత శంఖ చక్ర:🙏 🔥సూర్య నమస్కార మంత్రాలూ:🔥 1. ఓం మిత్రాయ నమ: 2. ఓం రవయే నమ: 3. ఓం సూర్యాయ నమ: 4. ఓం భానవే నమ: 5. ఓం ఖగాయ నమ: 6. ఓం పూష్ణే నమ: 7. ఓం హిరణ్య గర్భాయ నమ: 8. ఓం మరీచయే నమ: 9. ఓం ఆదిత్యాయ నమ: 10. ఓం పవిత్రే నమ: 11. ఓం అర్కాయ నమ: 12. ఓం భాస్కరాయ నమ: 🚩🚩 ఈ మంత్రాలూ చదువుతూ సూర్య నమస్కారాలు చేసిన తరువాత ఈ క్రింది శ్లోకమును చదువ వలెను. ♥ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వన్తి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే.. 🚩 క్రింద చెప్పిన మంత్రమును చదువుతూ ముమ్మారు సూర్యునకు అర్ఘ్యము నీయవలెను. ॥ సూర్యార్ఘ్యమంత్రం ॥ ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే । అనుకంపయ మాం భక్త్యా గృహాణార్ఘ్యం దివాకర ॥ సూర్య, సహస్రాంశో, తేజోరాశే, జగత్పతే, ఏహి. మాం అనుకంపయ. దివాకర, భక్త్యా అర్ఘ్యం గృహాణ ॥ సూర్య = ఓ సూర్యుడా సహస్రాంశో = అనంతమైన కిరణాలుకలవాడా తేజోరాశే = తేజస్సు యొక్క రాశి జగత్పతే = ప్రపంచానికి అధిపతీ ఏహి = రావయ్యా మాం = నన్ను అనుకంపయ = దయతో చూడు దివాక

💥🔥-ప్రపంచం సాగుతూనే ఉన్నాది.-🔥💥 ( 1850 లో రావి శాస్త్రి గారు రాసిన స్కెచ్..)

Image
- 💥🔥-ప్రపంచం సాగుతూనే ఉన్నాది.-🔥💥 (   1850 లో  రావి శాస్త్రి గారు రాసిన స్కెచ్..) 🚩🚩కాశీ నగరం. గంగానది ఒడ్డు! .#దుర్యోధన మహారాజు హతుడై పోయాట్ట. అధర్మం లో యుద్ధం ముగిసింది! ' చారుదత్తుడు అంటాడు'ధర్మాధర్మాల .మాటేమిటి? నీకూ, నాకూ కాదు, ప్రపంచానికే అంత్యకాలం ఆసంనమయినట్టుంది'. దేవదత్తుడు వాపోతాడు.'హర హర మాహాదేవ శంభో' ప్రతివైపు నుండి వినిపిస్తూంది.  ఇద్దరూ విశ్వేశ్వరాలయం వైపు మళ్లేరు.  * ... 🚩🚩సంఘారామం. సాయం ! #సమయం.'ఈ శంకరాచార్యుడు శివుడి అవతారమాట ' అన్నాడు ఉపాలి.'ఇంతకాలం తథాగతుడికి తలలోగ్గిన బ్రాహ్మణులు, తిరిగి తంత్రాలతో తలలేట్టుతున్నారన్న మాట.'' తిరిగి కులభేదాలేర్పడి ప్రజలు చెడిపోతార ఆనందా! 'అంతకన్నా ప్రమాదకరం: పరమాత్మకీ జీవాత్మకీ భేదం లేదట. నేనే అతడూ, అతడే నేనూ అనే సూత్రం గ్రహిస్తేయ్ అజ్ఞానాంధకారం లోంచి బైట పడ్డట్టే'ఇటువంటి దుష్ప్రచారాలకి ప్రపంచం లోబడితే అంతా ఆఖరి దశకి వచ్చినట్టే!' ఉపాలి నిట్టూరుస్తాడు.** 🚩🚩తాజమహల్ బయట.  #సాయంకాలం.'ఔరంగజేబ్ పాదుషా చనిపోయాడని పుకారు, విన్నావా? . కాఫర్లింక మనల్ని బతకనివ్వరు. '   హుసేన్.అ

🚩పరశురాముడు-శ్రీ మహాభారతంలో కథలు! 👉🏿👉🏿

Image
🚩పరశురాముడు-శ్రీ మహాభారతంలో కథలు! 👉🏿👉🏿 పరశురాముడు -శ్రీ మహాభారతంలో కథలు పరశురాముడి చరిత్ర చాలా చిత్రమైనది. పరశురాముడి తాత బుచీకుడనే ఋషి. ఆయన గాధిరాజు దగ్గరకు వెళ్ళి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్ళి చేయమని కోరాడు. తాపసికి పిల్లనివ్వటం ఇష్టం లేక, నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వేయింటిని తెచ్చి కానుకగా ఇస్తే తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానని షరతు పెట్టాడు గాధిరాజు. బుచీకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్ళిచేసుకున్నాడు. తరువాత ఒకసారి గాధిరాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని బుచీకుడ్ని అర్ధించాడు. అప్పుడాయన రెండు రకాల హోమద్రవ్యాలు తయారు చేసాడు. " ఇదిగో చూడు! ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు, అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు. ఇది మీ అమ్మకు ఇవ్వు. ఇలా చూడు, ఈ హవ్యం నీ కోసం ప్రత్యేకంగా తయారుచేసాను. ఇది తింటే తపస్సు, శమదమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు" అని భార్యతో చెప్పి బుచీకుడు స్నానానికి వెళ్ళాడు. అతను వెళ్ళిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు. సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది. వాటి ప్రభావం వర్ణి

🚩ఏకలవ్యుడి వృత్తాంతం.! (ఇదీ ఆరుద్ర గారి పరిశోధనా వ్యాసం)

Image
🚩ఏకలవ్యుడి వృత్తాంతం.! (ఇదీ ఆరుద్ర గారి పరిశోధనా వ్యాసం) , మనలో చాలామందికి ఏకలవ్యుడి కధ ఈ క్రింది విధంగా తెలుసు! ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప పాత్ర. ఇతను ఎరుకల కులానికి చెందినవాడు. ద్రోణాచార్యుని వద్ద విలువిద్యను అభ్యసించాలని కోరిక ఇతనికి ఎక్కువగా ఉండేది. ఆ కోరికను ద్రోణుడికి తెలియచేసాడు. ద్రోణుడు అతని కోరికను మన్నించక, దాన్ని తిరస్కరించాడు.కానీ కొన్ని కథల్లో, ద్రోణుడు ఏకలవ్యుడిని దూరంగా ఉంచటానికి కారణం అతని కులం అని చెపుతారు.ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సంపాదించాడు. ఒక సారి విలువిద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కులను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క వేగంగా తెలియక ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కొత్త వేషదారణతో ఏకలవ్యుడు కనిపించే సరికి కుక్క గట్టిగా అరిచింది. కుక్క అరుపుకు చిరాకు కలిగిన ఏకలవ్యుడు కుక్కు నోరు తెరచి మూయుటకు మధ్యగల సమయంలోనే దాని నోటిలోనికి 7 బాణాలు వేసాడు. తరువాత ఆ కుక్క అర్జున

🚩బ్రహ్మ ఐదో తల ఏమయ్యింది!

Image
🚩బ్రహ్మ ఐదో తల ఏమయ్యింది! 🍂☘️🍂 సృష్టికారుడైన ఆ బ్రహ్మను తలుచుకోగానే నాలుగు తలల రూపమే గుర్తుకువస్తుంది. ఈ నాలుగు తలలూ నాలుగు వేదాలకి ప్రతిరూపం అని కొందరంటే, నాలుగు దిక్కులకీ ఆధారం అని కొందరు భావిస్తుంటారు. కానీ ఈ నాలుగు తలలకీ సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. అదేమిటంటే... శతరూప- పూర్వం బ్రహ్మ, శతరూప అనే ఒక స్త్రీమూర్తిని సృష్టించాడు. వంద రకాలైన రూపాలను ధరించగల ఆ శతరూపని చూడగానే సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవునికే మతి చలించింది. తన కూతురితో సమానురాలు అన్న విషయాన్ని కూడా గ్రహించకుండా బ్రహ్మ చూపు ఆమె మీదే నిలిచింది. ఆమె నాలుగు దిక్కులా సంచరిస్తుంటే ఆమెనే గమనించేందుకు బ్రమ్మకు నాలుగు తలలు ఉద్భవించాయి. వీటికి తోడుగా శతరూప ఊర్ధ్వముఖంగా పయనించేటప్పుడు, ఆమెనే చూస్తూ ఉండేందుకు ఐదో తల కూడా ఏర్పడింది. ఈ దృశ్యాన్ని చూసిన పరమేశ్వరుడు, బ్రహ్మ చపలచిత్తానికి తగిన దండన విధించాలని అనుకున్నాడట. ఫలితం! శివుడు తన త్రిశూలంతో బ్రహ్మదేవుని ఐదో శిరసుని ఖండించివేశాడు. అలా ఖండించబడిన బ్రహ్మకపాలం బదరీనాధ్‌ క్షేత్రం దగ్గర పడిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఆ స్థలంలో కనుక పూర్వీకులకు పిండప్రదానాలను చేస్తే అధిక

♥🚩 మాయ లేడి - మాయ సీత కధ .🚩♥

Image
 ♥🚩 మాయ  లేడి - మాయ  సీత  కధ .🚩♥ (ఇది కొన్ని రామాయణాల్లో వున్న పిట్టకథ_) #సీతకోరగా మాయలేడిని పట్టుకోడానికి రాముడు వెళ్ళిన సమయంలో రామబాణానికి గురైన మారీచుడు(మాయలేడి)ప్రాణాలొదులుతూ 'హా సీతా హా లక్ష్మణా'అంటూ రాముని గొంతుతో అరవడం అదివిన్న సీతమ్మ రామునికేదో కీడువాటిల్లిందని తలచి కాపుగావున్న లక్ష్మణునిదుర్భాషలాడి  పంపడం. ఆసమయంలో రావణుడు సన్యాసి వేషంలో వచ్చి మోసగించి అపహరించడం అన్ని రామాయణాల్లోనూ వుంది.తరువాత ఒంటరిగా సీతను వదిలి వచ్చినందుకు తమ్ముని తిట్టి సీతకనబడక రాముడు చెట్టుని పుట్టని అడుగుతూ అడివంతా తిరిగి  ఏడవడం అన్నింటిలోవుంది.కొన్నింటిలోనే వున్నది_గగన విహారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు_ ఏడుస్తున్న రాముని చూశారు పార్వతి భర్తనడిగింది.'మీరు నన్ను రోజూ చేయమనేది ఈరాముని జపాన్నేనా?పెళ్ళాం కనబడక పోతే ఓకాముకుడిలా ఏడిచే ఇతడి జపమా చేసేది?'అని.'నువ్వే వెళ్ళి సీతలా కనబడి కాముకుడో కాదో పరీక్షించు.'అన్నాడుశివుడు.పార్వతి అచ్చు సీతగామారి రామునికి కొంచెందూరంలో పువ్వులుకోస్తోంది. రాముడొచ్చి దరిచేరితే పాఠంచెబ్దామనుకుంది.రాముడుదూరంనించే  'ఏమ్మా చెల్లాయ్ పార్వతీ బావగారినొదిల

🚩🚩చందామామ..జల భూతం కధ🚩🚩

Image
🚩🚩చందామామ..జల భూతం కధ🚩🚩 ♥ చాలా రోజుల నుండీ పెద్ద పెద్ద కధలు రాస్తున్నాను కదా! రాసీ రాసీ నాకైతే ఓపిక అయిపోయింది. అందుకని కొన్ని రోజులు కొన్ని చిన్న కధలు రాయాలనే ఉద్దేశంతో నాకు ఇష్టమైన ఈ చిన్న కధను రాస్తున్నాను. ఈ కధ ఏ పుస్తకంలోనిదో చెప్పలేను కానీ మా అమ్మ నా చిన్నప్పుడు చెప్పిన కధ అని మాత్రం చెప్పగలను. రామాపురం అనే ఊరిలో ఉండే రాజయ్యకి ఇద్దరు కొడుకులు. రాజయ్య చనిపోగానే రాజయ్య పెద్ద కొడుకు పొలం, ఇల్లూ, గొడ్డు గోదా అంతా ఆస్తీ తీసేసుకున్నాడు. రాజయ్య రెండో కొడుకు అయిన `చిన్నతమ్ముడు’, "అన్నా! మరి నా వాటా ఆస్తి ఏది?" అని అడుగగా, "ఇదుగో, ఈ నారతాడు నీ వంతు ఆస్తి. ఇంక పో” అని అటక మీద ఉన్న నారతాడుని చిన్నతమ్ముడికి ఇచ్చాడు అన్న. చిన్నతమ్ముడు చాలా మంచి వాడు అవటం వల్ల ‘సర్లే పోనీ. అన్నకి ఆస్తి అంతా తీసుకోవాలని ఉన్నట్టుంది’ అని తనకి తను సర్ధి చెప్పుకుని ఊరుకున్నాడే కానీ పంచాయితీ దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదు. చిన్నతమ్ముడికి చేతి పనులు చాలా బాగా చేయడం వచ్చు. వాడు ఊరు చివర ఉన్న అడవిలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న నారతాడుతో వలలూ, ఉచ్చులూ అల్లుకుని వాటితోటి ఒక కుందేలుని, ఒక ఉడతని పట్టుకున్నాడు.

♥సుమతీ శతకము!♥ -

Image
♥సుమతీ శతకము!♥ - #తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉంది. బహుజన ప్రియమైన శతాకాలలో సుమతీ శతకం ఒకటి. ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. #అప్పిచ్చువాడు వైద్యుడు", #తన కోపమె తన శత్రువు" వంటి పద్యలు తెలియని తెలుగువారు అరుదు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను సామెతలు లేదా జాతీయములుగా పరిగణించ వచ్చును. - సుమతీ శతకం వ్రాసినదెవరో కచ్చితమైన సమాచారం లభించడంలేదు. పలు రచనల్లో "సుమతీ శతక కర్త" అని ఈ రచయితను ప్రస్తావించడం జరుగుతుంది. క్రీ.శ. 1220-1280 మధ్య కాలంలో బద్దెన లేదా భద్ర భూపాలుడు అనే కవి సుమతీ శతకం రచించాడని సాహితీ చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు కాకతీయ రాణి రుద్రమదేవి (1262-1296) రాజ్యంలో ఒక చోళ సామంత రాజు. ఈ రచయితే రాజనీతికి సంబంధించిన సూక్తులతో నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇతడు మహాకవి తిక్కనకు శిష్యుడు. . సుమతీ శతకాన్ని బద్దెనయే రచించినట్లయితే తెలుగు భాషలో వచ్చిన మొదటి శతకాలలో అది ఒకటి అవుతుంది. (పాలకురికి సోమనాధుని వృషాధిప శతకము, యాతావక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వ

♥️హనుమాన్ చాలీసా తెలుగు అనువాదం.♥️

Image
♥️హనుమాన్ చాలీసా తెలుగు అనువాదం.♥️ 🚩🚩ఎమ్మెస్ రామారావు తెలుగులోకి అనువాదం చేశారు.  శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు || బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు ||శ్రీ|| 1. జయ హనుమంత జ్ణానగుణవందిత జయపండిత త్రిలోక పూజిత || 2.రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుతనామ || 3. ఉదయభానుని మధురఫలమని భావన లీల అమృతమును గ్రోలిన || 4. కాంచనవర్ణ విరాజితవేశా కుండలమండిత కుంచితకేశా ||శ్రీ|| 5. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి || 6. జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక జేరుకొని || 7. సూక్ష్మరూపమున సీతను చూచి వికటరూపమున లంకను గాల్చి || 8. భీమరూపమున అసురుల జంపిన రామకార్యమును సఫలముజేసిన ||శ్రీ|| 9. సీత జాడకని వచ్చిననిను కని శ్రీరఘువీరుడు కౌగిట నినుగొని || 10. సహస్రరీతుల నిను కొనియాడగ కాగలకార్యం నీపై నిడగా || 11. వానరసేనతో వారధిదాటి లంకేశునితో తలపడి పోరి || 12. హోరుహోరున పోరుసాగిన అసురసేనల వరుసన గోల్చిన ||శ్రీ|| 13. లక్ష్మణ మూర్చతో రాముడడలగ సంజీవిదెచ్చిన ప్రాణప్రదాత || 14. రామలక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి || 15. తిరుగులేని శ్రీరామ బాణ