🌹🌹🚩🚩విష్ణు సహస్రనామ స్తోత్రము!🚩🚩🌹🌹

 ♥🚩శుభోదయం 🚩♥



-

♦️శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన vedic ప్రార్థనలలో ఒకటి. పేరును బట్టి ఇది 

♦️శ్రీమహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.

❤️ స్తోత్ర కథ

అనేక పవిత్ర ధర్మములను విన్న తరువాత ధర్మరాజు భీష్ముని అడిగిన ఆరు ప్రశ్నలు:

♦️కిమ్ ఏకమ్ దైవతం లోకే - లోకంలో ఒక్కడే అయిన దేవుడు (పరమాత్ముడు) ఎవరు?

♦️కిమ్ వాపి ఏకమ్ పరాయణమ్ - జీవితానికి పరమపదమైన గమ్యము ఏది?

♦️స్తువంతః కమ్ ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును?

♦️కమ్ అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని అర్చించుట వలన మానవునకు శుభములు లభించును?

♦️కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః - మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?

♦️కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ - ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనములనుండి ముక్తి లభించును?

💕అందుకు భీష్ముడు చెప్పిన సమాధానం: జగత్ప్రభువును, దేవదేవుని, అనంతుని, పురుషోత్తముని వేయి నామములను నిశ్చలమైన భక్తితో స్తుతిసేయట వలనను, ఆరాధించుట వలనను, ధ్యానించుట వలనను, ప్రణామము చేయుట వలనను సర్వదుఃఖములనుండి విముక్తి పొందవచ్చును. ఆ బ్రాహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమ ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళ ప్రదుడు. సకల సృష్టి-స్థితి-లయ కారకుడు. 

♦️ఈ వేయి గుణ కీర్తనకరములైన నామములను ఋషులు గానము చేసారు.

❤️సంకల్పము

ఈ స్తోత్రమునకు

❤️ఋషి - వేదవ్యాసుడు

❤️ఛందస్సు - "అనుష్టుప్" Chanda should be Gayatri as per the verse "Gayatri chandah"

మంత్రాధిష్టాన దైవము - శ్రీమన్నారాయణుడు

❤️బీజము - అమృతాం శూద్భవః భానుః

❤️శక్తి - దేవకీ నందనః స్రష్టా

❤️మంత్రము - ఉద్భవః క్షోభణః దేవః

❤️కీలకము - శంఖభృత్ నందకీ చక్రీ

❤️అస్త్రము - శార్ఙ్గధన్వా గదాధరః

❤️నేత్రము -రథాంగపాణి రక్షోభ్యః

❤️కవచము -త్రిసామా సామగః సామః

❤️యోని - ఆనందం పరబ్రహ్మ

❤️దిగ్బంధము - ఋతుః సుదర్శనః కాలః

❤️ధ్యానము చేయు దేవుడు - విశ్వరూపమని భావించే విష్ణువు

❤️చేసే పని - సహస్రనామ జపము

❤️కారణము - శ్రీమహావిష్ణువు ప్రీతి కొరకు..

❤️ధ్యానము

1

♦️తరువాత స్తోత్రములో సంకల్పము (ఎవరిని, ఎందుకు స్తుతిస్తున్నాము) చెప్పబడుతుంది. 

♦️తరువాత పాలకడలిలో శంఖ చక్ర గదా పద్మములు ధరించిన వాడు, భూమియే పాదములుగా గలవాడు, సూర్యచంద్రములు నేత్రములైనవాడు, దిక్కులే చెవులైనవాడు, త్రిభువనములు శరీరముగా గలవాడు, శేషశాయి, విశ్వరూపుడు, శ్రీవత్సాంక కౌస్తుభ పీతాంబరధారి, నీలమేఘ వర్ణుడు అయిన రుక్మిణీ సత్యభామా సమేతుడు, ముకుందుడు, పరమాత్ముడు అయిన దేవునకు ధ్యానము చెప్పబడుతుంది.

♦️"హరిః ఓం" అంటూ వేయి నామాల జపం మొదలవుతుంది.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!