🔴🔻చమత్కార పద్యం.🔻🔴


 🔴🔻చమత్కార పద్యం.🔻🔴
ఇది ఒక అజ్ఞాతకవి వ్రాసిన కంద పద్యం
♦️అంచిత చతుర్ధ జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్
గాంచి, తృతీయం బక్కడ
నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!♥️
♥️భావం:
గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను....
♦️ఏమీ అర్థం కాలేదు కదా!? ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు
1) భూమి
2) నీరు
3) అగ్ని
4) వాయువు
5) ఆకాశం.
♦️ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి.
చతుర్థ జాతుడు అంటే వాయు నందనుడు,
పంచమ మార్గము అంటే ఆకాశ మార్గము,
ప్రధమ తనూజ అంటే భూమిపుత్రి సీత,
తృతీయము అంటే అగ్ని ,
ద్వితీయము దాటి అంటే సముద్రం దాటి ఇప్పుడు భావం చూడండి....
♦️హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని భావం
♥️ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి. వ్రాసిన కవికి నమస్సుమాంజలి.!!! 🙏🙏🙏

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩