🚩🚩అమరావతి కథలు -శంకరమంచి సత్యం. ❤



♦#'అమరావతి గుంటూరు జిల్లాలో ఓ వూరు యిది.

అక్కడ అమరేశ్వరుడు వెలసి వున్నాడు. క్షేత్రపాలకుడైనా వేణుగోపాలస్వామి గుడి వుంది.

పైగా బౌద్ధం విలసిల్లిన చోటు కూడాను.

వాసిరెడ్డి నాయుడు రాజ్యం చేసిన చోటు.

♦ఇంత ఇంపార్టెన్సు వుంది కాబట్టే అమరావతిని కేంద్రంగా చేసుకుని శంకరమంచి సత్యంగారు నూరు కథలు రాశారు.

♦అవి ఎంత పాప్యులర్‌ అయ్యాయంటే శ్యామ్‌ బెనగల్‌ వాటిని బేస్‌ చేసుకుని 'అమరావతీ కీ కహానియాఁ' పేరుతో హిందీలో టీవీ సీరియల్‌గా తీశారు. దూర్‌దర్శన్‌లో దేశమంతటా ప్రసారం అయ్యాయి.

♦ఆ కథల్లో రకరకాలైన థీమ్స్‌ వున్నాయి. ఇవి 100 కథలు. ఆంధ్రజ్యోతి వార పత్రికలో సీరియల్‌గా వచ్చాయి. తర్వాత 1978లో బాపుగారి బొమ్మలతో, ముళ్లపూడి వెంకటరమణగారి పీఠికతో పుస్తకరూపంలో వచ్చాయి. ఈ కథలకు 1979 రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తర్వాత హిందీలో

♦అమరావతి కథలు చెప్పేముందు అమరావతి ఎక్కడుందో చెప్పాలిగా, ఎలా వెళ్లాలో చెప్పాలిగా. అదీ సత్యంగారే చెప్పారు

'అదుగో అల్లదుగో' అనే కథలో - గుంటూరులో బస్సెక్కాలి.

♦ఎక్కారా? తోసుకోటం, గుద్దుకోటం, ముందెక్కుతున్నవాళ్లని వెనక్కి లాగేయటం, వెనకున్నవాళ్లని మోచేతుల్తో కుమ్మేయటం అన్నీ అయ్యాయా -

'ఏందయ్యా, ఆడంగుల్ని ముందెక్కనీ' - 'అమ్మో నా కాలు తొక్కేశారు, దేవుడోయ్‌'

'చెవులవీ చేతులవీ జాగర్తేవ్‌' - 'సామాన్లు కిటికీలోంచి లోపలకి తోసేయ్‌'... లాటి కేకలు వినబడ్డాయా?

♦బస్సు బరువెక్కింది. కిక్కిరిసిన జనాలు, శనక్కాయ మూటలు, ధనియాల బస్తాలు, కూరగాయల బుట్టలు, రేకు పెట్టెలు, పలుపుతాళ్లు, పారలు, ఉక్క. బస్తా కుదించి మూతి కుట్టేసినట్టుంది. ఇక లోపలున్న జనాలు ఊరుకుంటారా?

'ఏందమ్మా! అంత సోటుంటే మీది మీదికి పడ్తావూ..?'

'సుట్ట తీసేవోయ్‌ సోగ్గాడ...అప్పుడే ముట్టించాడు..దొర చుట్ట' అంటూ చిన్న చిన్న తగాదాలు.

♦కండక్టరు కారా కిళ్లీ నముల్తూ వచ్చాడు. 'ఎవరివీ బస్తాలూ..? ఈ బుట్టల్దీసెయ్‌!.. ఎడ్లబండనుకున్నారా?..గోరంట్లకి మూడు టిక్కెట్లా? సిటీబస్‌లో పోలేవూ? దిగుదిగు.' ఇలా అంటూ టిక్కెట్లు కోస్తూండగానే డ్రైవర్‌, క్లీనరూ వచ్చేశారు. క్లీనర్‌ 'సొంత యిల్లంటయ్యా పరుపుల మీద కూకున్నట్టు కూకోడానికి. పదిమంది కూకునే చీటు. సర్దుగోండి' అంటూ హంగు చేస్తూ

♦జూనియర్‌ డ్రైవర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్‌

'గురూ! రైటుక్కొయ్‌ ఎడంకి లాగుతోంది జాగర్త... ఎనక లారీవోడొస్తున్నాడు సైడియ్‌..ముందు మేకపిల్లుంది సూస్కో.. చింతకాయలు కొట్టుకునే ఆ పిల్లనేం జూస్తావ్‌..ముందు రోడ్డు చూడు బే!' అంటూ పార్థసారథియై బస్సును, కథ నడిపిస్తాడు.

♦గోరంట్ల, లాం, నిడుముక్కల వచ్చాయి వెళ్లాయి. మోతడక పొలిమేరల్లో డ్రైవరుగారు బస్‌ ఆపేసి 'ఇంజను హీటెక్కింది.

నీళ్లు పొయ్యి' అని అక్కడున్న గుడిసెలోకి వెళ్లిపోయేడు. కాస్సేపు పోయాక వచ్చాడు... బస్సు పధ్నాలుగో మైలు వచ్చింది. అక్కడ కాఫీలు తాగమని పర్మిషన్‌ యిచ్చారు. మరో పావుగంట తర్వాత యండ్రాయి వచ్చింది. ఆ తర్వాత నరుకుళ్లపాడు.

♦ఓ మైలు పోతే కృష్ణగాలి వచ్చింది.

మరో మైలు రాగానే వైకుంఠపురం కొండ కన్పించింది.

మరో అరమైలు ఉందనగా దేవాలయ గోపురం,.

.అదిగో శిఖరం.. దీపాలదిన్నె.. అమరావతి వచ్చేశాం.

'♦ఓల్డన్‌' అన్నాడు క్లీనర్

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩