🌹🌺🙏శ్రీ నివాసుని కంఠమున తులసిమాల 💥🌺🌹


♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️



♦వనవిహారమునకు వెళ్ళిన శ్రీనివాసుడు, పద్మావతి 

ఎంతసేపటికి కుటీరమునకు రానందుకు తన పెద్దకుమారుడైన 

గోవిందరాజస్వామిని వకుళమాతతోడుగావెంటబెట్టుకొని­ ఆనందనిలయమును సమీపించి శిలగా మారిన శ్రీనివాసుని చూచి "నాయనా! శ్రీనివాసా!" అని ఆర్తనాదము చేసెను. 

శిలలో నుండి మాటలు ఈ విధముగా వకుళమాతకు వినిపించాయి.

♦ "జననీ! నీకు ముక్తి ప్రసాదించుచున్నాను.

 నీవు తులసిమాలగా మారి నా కంఠమున చేరు" అన్నట్లు వినిపించెను.

 వకుళామాత తులసిమాలగా శ్రీనివాసుని కంఠమున చేరెను.

♦ అందుకే శ్రీనివాసస్వామివారిన­ి తులసిదళములతో పూజిస్తారు. 

♦శ్రీనివాసస్వామికి తులసిదళములు అంటే చాలా ప్రీతి.

.🔴  గోవిందరాజస్వామి తిరుపతి పట్టణమున వేలయుట :-

♦గోవిందరాజస్వామి, శిలగాయున్న తమ్మున్ని చూసి శ్రీనివాసా! ధనరాసులు ఎంత కొలచినను తరుగుట లేదు. ఆయాసమగుచున్నది అనగా, 

"సోదరా! నీహస మందు ధనరేఖలు

 యున్నవి. కావున సిరి ఎక్కువ అగుచుండును. నీవు కొండక్రింది 

భాగమున పోయి విశ్రాంతి తీసుకొనుము" అన్నాడు.

♦వెంటనే గోవిందరాజస్వామి కొండ క్రిందికి పోయి కొలత పాత్రను

 తల క్రింద ఉంచుకొని శిలగా మారిపోయాడు. 

గోవిందరాజస్వామి వెలసిన ప్రదేశము కాబట్టి దానికి 

గోవిందరాజ పట్టణము అని పేరు వచ్చినది. కాలక్రమేణ 

అది తిరుపతి పట్టణముగా పేరు వచ్చింది.

.

🔴  -పర్వత నామములు :-

♦శ్రీ తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామీ నివసించు పర్వతమునకు 

ఏడు పేర్లు కలవు.

♦ఆదిశేషుని రూపమున ఉండుటచే - శేషాచలము అని

♦ఆ పర్వతమున వేదములు ఇమిడివున్నందున - వేదాచలము అని

♦భూలోకమునకు గరుత్మంతునిచే పర్వతమును చేరినందుకు - 

గరుడాచలం అని

♦వృషాసురుడు అను రాక్షసుడు మోక్షము పొందినందున - 

వృషభాద్రి అని

♦అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుని కన్నస్థలము అయినందున - అంజనాద్రి అని

♦ఆదిశేషుడు, వాయుదేవుడు బలాబలములు చూపి పర్వతము ఇచ్చట చేర్చినందుకు - ఆనందగిరి అని

♦మన పాపములు పోగొట్టు పర్వతము అయినందుకు - వెంకటాచలము అని సార్థకమయి ఈ పర్వతములకు పేర్లు కలిగాయి.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩