🚩🚩-కాంతం కబుర్లు .-🚩🚩



***♦1962సంవత్సరంలో అనుకుంటాను… ***
రాజమండ్రిలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో తెలుగు రచయితల మహాసభలు జరిగాయి… అప్పుడు మునిమాణిక్యం, మొక్కపాటి, నోరి నరసింహశాస్త్రి, భమిడిపాటి రాధాకృష్ణ మొ||న అనేకమంది రచయితలను చూసే భాగ్యం నాకు కలిగింది… మునిమాణిక్యం వారు ప్రసంగించారు… ప్రతి అక్షరం వివరించలేను కాని ఆయన మాట్లాడిన దాని సారాంశంగా— “…
.
♦ఈ నెల జీతం మా కాంతానికిచ్చాను…లెక్కెట్టుకుంది…
‘ఏమిటండీ జీతం తక్కువ ఉందేమిటే’ అంది.
‘వాళ్ళు తీసుకున్నారే’ అన్నాను.
‘వాళ్ళెవరు ?’ –
‘గవర్నమెంటోళ్ళు’ –
♦‘గవర్నమెంటోళ్ళా ? ఎందుకు ?’ –
‘వాళ్ళేదో యుద్ధం చేస్తున్నారట. అందుకని….’ అన్నాను.
‘యుద్ధమా ? ఎవరితోనూ ?’ అడిగింది కాంతం.
♦‘చైనా వాళ్ళతోటి మన గవర్నమెంటు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అందుకని మా ఉద్యోగస్థులందరి దగ్గర ఓ రోజు జీతం
విరాళంగా వసూలు చేసారు.. ఇలా ఇంకా కొన్నాళు చేస్తారట….’ అని వివరించా.
‘♦ఆ చీనీ వాళ్ళతో వీళ్ళు యుద్ధం చేస్తారా ? దానికి మీ అందరి దగ్గర డబ్బులు లాక్కుంటారా ? బాగుందండి…. నాకు తెలియక
అడుగుతాను… మీ డబ్బులూ, మీ డబ్బులూ పోగు చేసి ఇంతోటి వెర్రిముండా గవర్నమెంటూ ఇప్పుడు యుద్ధం చేయకపోతే
వచ్చే నష్టమేమిటి… అదేదో డబ్బులున్నప్పుడే ఏడవొచ్చుకదా ? ? ? ‘
♦సున్నితంగా చురకలంటించే మునిమాణిక్యంవారి హాస్యమది… ఆ సందర్భానికి తగ్గట్టు ఆ సమయంలో జరుగుతున్న చైనా వార్ నేపధ్యంలో చేసిన ఈ హాస్య ప్రసంగం ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వుతెప్పిస్తుంది.
.
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩